
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య పోరు రసవత్తరంగా మారనుంది. గత గణాంకాలను పరిశీలిస్తే, హైదరాబాద్ జట్టు స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. పవర్ఫుల్ బ్యాటర్లు, పదునైన బౌలర్లతో కూడిన ఈ రెండు జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ రికార్డులు బద్దలవ్వనున్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఈ రెండు జట్లు మొత్తం 22 సార్లు తలపడ్డాయి. ఇందులో హైదరాబాద్ 12 సార్లు విజయం సాధించగా, రాజస్థాన్ 10 సార్లు విజేతగా నిలిచింది. ముఖ్యంగా హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచుల్లో రాయల్స్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది సన్రైజర్స్ జట్టు. గత ఐదు మ్యాచుల్లో హైదరాబాద్ నాలుగు సార్లు గెలుపొందడం విశేషం.
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలిస్తుంది. ఇక్కడ జరిగిన గత 84 మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 35 సార్లు, ఛేజింగ్ చేసిన జట్లు 47 సార్లు విజయం సాధించాయి. సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 166 పరుగులుగా ఉంది. అయితే, ఇటీవలి కాలంలో వికెట్లు ఫ్లాట్గా ఉండటంతో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. కాగా, హైదరాబాద్ జట్టు బౌలింగ్కు.. బ్యాటర్లు ఎంత స్కోర్ కొట్టినా గెలవడం కష్టమేనని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఇది చదవండి: పాక్ క్రికెటర్లకు పదేళ్లు పట్టింది.. కట్ చేస్తే.. 6 బంతుల్లోనే బుమ్రాను తగలబెట్టేశాడుగా