IND vs ZIM: “ముందు దేశభక్తుడిగా మారు..”: భారత యువ ఆటగాడికి ఇచ్చి పడేసిన వరల్డ్ కప్ విన్నర్..

|

Jul 03, 2024 | 8:45 AM

Sreesanth Advice to Riyan Parag: ఐపీఎల్ 2024లో తన జట్టు రాజస్థాన్ రాయల్స్ తరపున అద్భుత ప్రదర్శన చేసిన యువ ఆల్ రౌండర్ రియాన్ పరాగ్, జింబాబ్వేతో జరగనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టులోకి ఎంపికయ్యాడు. అతని ప్రదర్శన కారణంగా, పరాగ్ 2024 టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టులో ఎంపికవుతాడని అంతా భావించారు. కానీ, అతను ఎంపిక కాలేదు.

IND vs ZIM: ముందు దేశభక్తుడిగా మారు..: భారత యువ ఆటగాడికి ఇచ్చి పడేసిన వరల్డ్ కప్ విన్నర్..
Riyan Parag Sreesanth
Follow us on

Sreesanth Advice to Riyan Parag: ఐపీఎల్ 2024లో తన జట్టు రాజస్థాన్ రాయల్స్ తరపున అద్భుత ప్రదర్శన చేసిన యువ ఆల్ రౌండర్ రియాన్ పరాగ్, జింబాబ్వేతో జరగనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టులోకి ఎంపికయ్యాడు. అతని ప్రదర్శన కారణంగా, పరాగ్ 2024 టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టులో ఎంపికవుతాడని అంతా భావించారు. కానీ, అతను ఎంపిక కాలేదు. ఆ తర్వాత జట్టులోకి ఎంపిక కానందున టోర్నీ చూడబోనని విచిత్రమైన స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన పరాగ్‌పై భారత మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ మండిపడ్డారు.

ముందు దేశ భక్తుడిలా మారు: శ్రీశాంత్

ముందు దేశభక్తుడిగా మారాలని శ్రీశాంత్ రియాన్ పరాగ్‌కు సూచించాడు. టీ20 ప్రపంచ కప్ 2024 కోసం టీమ్‌లో BCCI ఎంపిక చేయకపోవడంతో రియాన్ పరాగ్ నిరాశ చెందాడు. ఆ తర్వాత, టీఆర్ఎస్ పోడ్‌కాస్ట్‌లో సంభాషణ సందర్భంగా, మీరు టోర్నమెంట్ చూస్తారా లేదా అని అడిగినప్పుడు? దీనిపై పరాగ్ స్పందిస్తూ.. ఇకపై క్రికెట్ చూడాలని లేదు. నాకు ప్రపంచకప్ ఆడాలని ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.

స్టార్ స్పోర్ట్స్‌తో జరిగిన సంభాషణలో శ్రీశాంత్ మాట్లాడుతూ ఇటువంటి ప్రకటన చేసినందుకు పరాగ్‌ను మందలించాడు. ‘కొందరు యువ ఆటగాళ్లు కూడా తాము ఎంపిక కానందున ప్రపంచ కప్‌ను చూడబోమని చెప్పారు. ముందుగా మీరు దేశభక్తులు కావాలని, ఆ తర్వాత క్రికెట్ ప్రేమికులు కావాలని నేను వారికి చెప్పాలనుకుంటున్నాను. జట్టులో ఎంపికైన వారికి పరిపూర్ణ హృదయం, మనస్సు, అభిరుచితో మద్దతు ఇవ్వాలి’ అంటూ చెప్పుకొచ్చాడు.

దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్ 17వ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచినందుకు రియాన్ పరాగ్‌కు బహుమతి లభించడం గమనార్హం. జింబాబ్వే టూర్‌కు భారత జట్టులో ఎంపికైన తర్వాత రియాన్ సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

ఐపీఎల్ చివరి సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన పరంగా మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు 22 ఏళ్ల ఆల్ రౌండర్ జింబాబ్వేపై కూడా మంచి ప్రదర్శన చేయడం ద్వారా తనదైన ముద్ర వేయాలనుకుంటున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..