W,W,W,W,W,W.. 49ఏళ్ల తర్వాత తొలిసారి.. ఒంటిచేత్తో టీమిండియాను సిగ్గుపడేలా చేసిన ప్రీతిజింటా చిచ్చర పిడుగు

India vs South Africa, 2nd Test: దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్ ఆల్ రౌండ్ ఆటతో అదరగొట్టాడు. తొలుత బ్యాటింగ్‌తో తన అద్భుతమైన ప్రదర్శన తర్వాత, గౌహతి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టి, చరిత్ర సృష్టించాడు.

W,W,W,W,W,W.. 49ఏళ్ల తర్వాత తొలిసారి.. ఒంటిచేత్తో టీమిండియాను సిగ్గుపడేలా చేసిన ప్రీతిజింటా చిచ్చర పిడుగు
Ind Vs Sa Marco Jansen

Updated on: Nov 24, 2025 | 5:12 PM

Marco Jansen five-wicket haul: గౌహతి టెస్ట్‌లోనూ భారత జట్టు ఓటమి దిశగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సరికి సౌతాఫ్రికా జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. మొత్తంగా సౌతాఫ్రికా ఆధిక్యం 314 పరుగులకు చేరింది. భారత జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 201 పరుగులకే ఆలౌట్ అయింది. బ్యాటింగ్ పిచ్‌లో భారత ఆటగాళ్లు తీవ్రంగా విఫలమయ్యారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్ భారత జట్టు పాలిట విలన్‌లా మారాడు. తొలుత బ్యాట్‌తో ఆ తర్వాత బంతితో విధ్వంసం సృష్టించాడు. గౌహతి టెస్ట్ మూడో రోజు ఈ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ ఒంటి చేత్తో టీమిండియా ఇన్నింగ్స్‌లో సగభాగాన్ని పెవిలియన్ చేర్చాడు. జాన్సెన్ కేవలం 48 పరుగులకు 6 వికెట్లు పడగొట్టి ఒక భారీ రికార్డును నెలకొల్పాడు. జాన్సెన్ విధ్వంసకర బౌలింగ్‌తో టీమిండియా కేవలం 201 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో దక్షిణాఫ్రికాకు 288 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని ఇచ్చింది.

యాన్సన్ విధ్వంసం..

భారత పిచ్‌లు సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయి. కానీ గౌహతిలో, యాన్సన్ ప్రతిభ స్పష్టంగా కనిపించింది. 6 అడుగుల 8 అంగుళాల పొడవున్న ఈ ఆటగాడు తన బౌన్సర్లతో భారత బ్యాట్స్‌మెన్‌ను ఊపిరి ఆడకుండా చేశాడు. యాన్సన్ ధ్రువ్ జురెల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా వికెట్లను తీసుకున్నాడు. యాన్సన్ బౌన్సర్లు భారత బ్యాట్స్‌మెన్స్‌ను ఇబ్బంతి పెట్టాయి. ఫాస్ట్ బౌలర్ తన ఆరు వికెట్లలో ఐదు బౌన్సర్లతోనే పడగొట్టాడు.

యాన్సన్ ఖాతాలో భారీ రికార్డు..

మార్కో జాన్సెన్ ఆరు వికెట్లు పడగొట్టడం అతని టెస్ట్ కెరీర్‌లో నాలుగోసారి. భారత్‌పై ఇది అతని తొలి ఐదు వికెట్లు, భారత గడ్డపై ఇది అతని అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. భారత గడ్డపై యాభైకి పైగా ఇన్నింగ్స్ సాధించడమే కాకుండా ఐదు వికెట్లు కూడా సాధించిన తొలి దక్షిణాఫ్రికా ఎడమచేతి వాటం స్పిన్నర్ జాన్సెన్. ప్రపంచంలో ముగ్గురు ఆటగాళ్ళు మాత్రమే ఈ ఘనతను సాధించారు. చివరిసారిగా 1976లో ఇంగ్లాండ్ కు చెందిన జాన్ లివర్ ఈ ఘనతను సాధించాడు.

భారతదేశంలో దక్షిణాఫ్రికా ఆటగాడు ఐదు వికెట్లు తీసి అర్ధ సెంచరీ చేసి 25 సంవత్సరాలు అయింది. మార్కో జాన్సెన్ కంటే ముందు, నిక్కీ బోజే 2000 లో ఈ ఘనత సాధించాడు.

భారత్‌కు ఫాలో-ఆన్ ఇవ్వలే..

మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో భారత్ 201 పరుగులకే ఆలౌట్ అయింది. కానీ దక్షిణాఫ్రికా ఫాలో-ఆన్ విధించలేదు. భారతదేశంలో భారత్‌పై 288 పరుగుల ఆధిక్యం సాధించిన జట్టు ఫాలో-ఆన్ విధించకపోవడం ఇదే మొదటిసారి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us