IND Vs SL : టీమిండియాకు గుడ్ న్యూస్.. గాయం నుంచి కోలుకున్న స్టార్ బ్యాట్స్ మెన్

IND Vs SL : శ్రీలంక టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ ఊరట లభించింది. కాలి బొటనవేలి గాయం నుంచి కోలుకుంటున్న సాయి సుదర్శన్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించాడు. ఆగస్టు 7 వార్మప్ మ్యాచ్‌లో ఫిట్‌నెస్ నిరూపిస్తే తొలి టెస్టులో ఆడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

IND Vs SL : టీమిండియాకు గుడ్ న్యూస్.. గాయం నుంచి కోలుకున్న స్టార్ బ్యాట్స్ మెన్
Sai Sudharsan

Updated on: Aug 01, 2026 | 3:21 PM

IND Vs SL : శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో భారత జట్టు పర్యటనకు సిద్ధమవుతోంది. ఈ సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్‌తో పాటు జస్ప్రీత్ బుమ్రా పేర్లు ఉన్నప్పటికీ, వారు ఫిట్‌నెస్ నిరూపించుకోవడంపైనే మ్యాచ్‌లు ఆడటం ఆధారపడి ఉంది. అయితే భారత్ నుంచి జట్టు బయలుదేరడానికి కొన్ని రోజుల ముందే సాయి సుదర్శన్ గాయం తీవ్రత తగ్గి, కోలుకుంటుండటం భారత మేనేజ్‌మెంట్‌కు పెద్ద ఉపశమనం కలిగిస్తోంది.

నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ

క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. సాయి సుదర్శన్ కాలి బొటనవేలి గాయంతో బాధపడుతున్నాడు. ఇటీవల లంకతో జరిగిన ఇండియా ‘ఎ’ పర్యటనలో ఆయన ఈ గాయానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ వద్ద రీహ్యాబిలిటేషన్‌లో ఉన్నాడు. వైద్యులు ఇంకా ఆయనను అధికారికంగా పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు నిర్ధారించనప్పటికీ, సుదర్శన్ ఇప్పటికే నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. మొదటి టెస్ట్ సమయానికి ఆయన పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఆగస్టు 7న వార్మప్ మ్యాచ్‌తో అసలు పరీక్ష

సాయి సుదర్శన్ ఆగస్టు 15న జరిగే తొలి టెస్టులో బరిలోకి దిగుతాడా లేదా అనేది ఆగస్టు 7న జరిగే వార్మప్ మ్యాచ్ ద్వారా స్పష్టమవుతుంది. కొలంబోలో స్థానిక శ్రీలంక XI జట్టుతో భారత జట్టు 3 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గనుక సాయి సుదర్శన్ పాల్గొని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడితే, గాలెలో జరిగే తొలి టెస్టులో భారత తుది జట్టులో అతనికి స్థానం దక్కడం ఖాయం.

మిగతా ఆటగాళ్ల ఫిట్‌నెస్ అప్‌డేట్

ఈ సిరీస్ కోసం బుమ్రాతో పాటు సాయి సుదర్శన్ ఫిట్‌నెస్‌ను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా జట్టులోకి తిరిగి రాగా, వాషింగ్టన్ సుందర్ గాయం వల్ల దూరమయ్యాడు. దీంతో సారాంశ జైన్‌కు జట్టులో అవకాశం దక్కింది. యంగ్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్‌లతో కూడిన భారత బ్యాటింగ్ లైనప్‌కు సాయి సుదర్శన్ అందుబాటులోకి వస్తే మరింత బలం చేకూరుతుంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us