
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయి ఏళ్లు గడుస్తున్నా.. ఆయన సృష్టించిన కొన్ని రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. 2023 వన్డే ప్రపంచ కప్లో, బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ 2023 ప్రపంచ కప్లో ఇండియా vs ఇంగ్లాండ్ సెమీఫైనల్లో సెంచరీ సాధించాడు. వన్డే ఇంటర్నేషనల్స్లో (ODIలు) 50 సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా నిలిచి టెండూల్కర్ అతిపెద్ద రికార్డులలో ఒకదాన్ని కోహ్లీ బద్దలు కొట్టాడు. తన రికార్డును బద్దలు కొట్టిన తర్వాత, కోహ్లీ టెండూల్కర్కు నమస్కరించి, అతని ఆశీర్వాదాలు తీసుకొని ముందుకు సాగాడు.
అయితే టెండూల్కర్ 200 టెస్ట్ల్లో 15921 పరుగులతో టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, గత రెండేళ్లలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ అన్ని రికార్డులను బద్దలు కొట్టాడు. అతను సచిన్ టెండూల్కర్ తర్వాత టెస్ట్ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. టెండూల్కర్ను అధిగమించడానికి రూట్ కేవలం 2378 పరుగుల దూరంలో ఉన్నాడు. టెండూల్కర్ ఇప్పటివరకు రూట్ రికార్డు గురించి ఎక్కువగా మాట్లాడటానికి దూరంగా ఉన్నాడు, కానీ రెడ్డిట్తో AMA సెషన్లో దాని బ్రాండ్ అంబాసిడర్ అయిన సచిన్ రూట్ తన టెస్ట్ రన్స్కు దగ్గరగా రావడంపై స్పందించాడు.
జో రూట్ 13,000 టెస్ట్ పరుగులు దాటాడు. మీ తర్వాత రెండవ స్థానంలో ఉన్నాడు దీనిపై మీ అభిప్రాయం ఏంటని ఎదురైన ప్రశ్నకు సచిన్ సమాధానమిస్తూ.. “13000 పరుగులు దాటడం సాధారణ విషయం కాదు. అతను(రూట్) ఇప్పటికీ ఫిట్గా ఉన్నాడు. 2012లో నాగ్పూర్లో అతని తొలి టెస్ట్ సందర్భంగా నేను అతనిని మొదటిసారి చూసినప్పుడు, ఇంగ్లాండ్ భవిష్యత్తు కెప్టెన్ అవుతాడని నా సహచరులతో చెప్పాను. అతను వికెట్ను అంచనా వేయగలిగిన విధానం, అతను స్ట్రైక్ రొటేషన్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అతను పెద్ద ఆటగాడు అవుతాడని నాకు అప్పుడే అనిపించిందని సచిన్ పేర్కొన్నాడు. రూట్ 2025లో ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో ఆడుతూ రికీ పాంటింగ్ను అధిగమించి టెస్ట్లలో రెండవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి