ధోనీపై పాక్ మంత్రి ట్వీట్… నెటిజన్లు గుస్సా!

|

Jul 14, 2019 | 7:02 PM

ముంబై: ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌లోనే నిష్క్రమించడంతో భారత్ అభిమానులు తీవ్ర నిరాశకు గురైన సంగతి తెలిసిందే. అయితే భారత్ సెమీస్‌తో ఇంటి ముఖం పట్టడం… దాయాది పాకిస్థాన్‌కు, ఆ దేశ క్రికెట్ అభిమానులకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. వారు ట్విట్టర్ ద్వారా భారత్‌ అభిమానులకు చురకలంటిస్తున్న విషయం తెలిసిందే. ఇదే అదునుగా ఆ దేశ మంత్రి ఫావాద్ చౌదరి టీమిండియా, ధోనీపై తనకున్న కోపాన్ని చాటుకున్నాడు. సెమీస్‌లో ఇండియా ఓడిపోవడానికి అన్ని విధాల సమంజసమేనని ఫావాద్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. […]

ధోనీపై పాక్ మంత్రి ట్వీట్... నెటిజన్లు గుస్సా!
Follow us on

ముంబై: ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌లోనే నిష్క్రమించడంతో భారత్ అభిమానులు తీవ్ర నిరాశకు గురైన సంగతి తెలిసిందే. అయితే భారత్ సెమీస్‌తో ఇంటి ముఖం పట్టడం… దాయాది పాకిస్థాన్‌కు, ఆ దేశ క్రికెట్ అభిమానులకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. వారు ట్విట్టర్ ద్వారా భారత్‌ అభిమానులకు చురకలంటిస్తున్న విషయం తెలిసిందే. ఇదే అదునుగా ఆ దేశ మంత్రి ఫావాద్ చౌదరి టీమిండియా, ధోనీపై తనకున్న కోపాన్ని చాటుకున్నాడు.

సెమీస్‌లో ఇండియా ఓడిపోవడానికి అన్ని విధాల సమంజసమేనని ఫావాద్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. క్రికెట్‌ను బెట్టింగ్, పక్షపాత దోరణితో ధోని కలుషితం చేసినందుకు.. అతడు ఇలాంటి ఫేర్‌వెల్‌కు అర్హుడని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌ను రీ-ట్వీట్ చేశాడు. పైగా తమకు ఇప్పుడు న్యూజిలాండ్ కొత్త దోస్త్ అంటూ చేసిన ట్వీట్‌పై భారత్ అభిమానులు, నెటిజన్లు గుస్సా అవుతున్నారు. న్యూజిలాండ్ స్పెల్లింగ్ కూడా సరిగ్గా రాయని నువ్వు ఓ మంత్రివా అంటూ మండిపడ్డారు.