తొలి వార్మప్‌ మ్యాచ్‌లో చేతులెత్తేసిన భారత్

ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా లండన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో భారత్ చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. 39.2 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ బ్యాటింగ్ పవర్‌ప్లే ముగిసేలోపే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కేన్ విలియమ్‌సన్, రాస్ టేలర్‌లు కలిసి జట్టుకు అండగా నిలిచారు. వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కి 114 పరుగులు జోడించారు. ఈ […]

తొలి వార్మప్‌ మ్యాచ్‌లో చేతులెత్తేసిన భారత్

Updated on: May 25, 2019 | 9:49 PM

ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా లండన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో భారత్ చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. 39.2 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ బ్యాటింగ్ పవర్‌ప్లే ముగిసేలోపే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కేన్ విలియమ్‌సన్, రాస్ టేలర్‌లు కలిసి జట్టుకు అండగా నిలిచారు. వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కి 114 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలు చేశారు. అయితే చాహల్ వేసిన 30వ ఓవర్ ఐదో బంతికి విలియమ్‌సన్ 67పరుగులు చేసి రోహిత్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక విజయానికి 1 పరుగు అవసరం ఉండగా.. 71పరుగులు చేసిన రాస్ టేలర్ కూడా వెనుదిరిగాడు. చివరిగా.. హెర్నీ నికోలస్ కావాల్సిన ఒక్క పరుగు చేయడంతో న్యూజిలాండ్ 37.1 ఓవర్లలో 180 పరుగులు చేసి.. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us