BCCI: ఆటతీరుతో కాదు.. ఫేవరిటజంతోనే టీమిండియాలో సెలెక్షన్స్.. విమర్శలు గుప్పించిన మాజీ క్రికెటర్..

Team India: భారత జట్టు మాజీ ఆటగాడు వెంకటేష్ ప్రసాద్ సెలక్షన్ కమిటీపై తీవ్రంగా విమర్శలు గుప్పించాడు. భారత జట్టులో ఎంపికలపై మరోసారి చర్చలకు దారి తీశాడు.

BCCI: ఆటతీరుతో కాదు.. ఫేవరిటజంతోనే టీమిండియాలో సెలెక్షన్స్.. విమర్శలు గుప్పించిన మాజీ క్రికెటర్..
Team India Bcci Selections

Updated on: Feb 12, 2023 | 8:13 AM

Venkatesh Prasad Comments on BCCI Selection Committee: నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో కేఎల్ రాహుల్ ఎంపిక పక్షపాతంతో జరిగిందని భారత మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. ఈ మ్యాచ్‌లో మూడో రోజునే భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో 30 ఏళ్ల రాహుల్‌కు ఇన్‌ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌ కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటూ పేర్కొన్నాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్ 71 బంతుల్లో 20 పరుగులతో చాలా కష్టతరమైన ఇన్నింగ్స్ ఆడాడు. పరుగులు చేసేందుకు చాలా కష్టపడ్డాడు.

వెంకటేష్ ప్రసాద్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో “రాహుల్ పనితీరు ఆధారంగా కాదు, అభిమానం ఆధారంగా ఎంపిక చేశారు. అతని ప్రదర్శనలో స్థిరత్వం లేకపోవడం, ఇది దాదాపు ఎనిమిదేళ్లుగా కొనసాగుతోంది. అతను తన సామర్థ్యాన్ని ప్రదర్శనగా మార్చుకోలేదు’ అంటూ రాసుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

రాహుల్ 46 మ్యాచ్‌లలో 34.07 టెస్ట్ సగటుతో ఉన్నాడు. ప్రసాద్ రాహుల్ టెస్ట్ రికార్డుల గురించి మాట్లాడుతూ, రోహిత్ శర్మతో పాటు క్రికెట్‌పై మంచి అవగాహన ఉన్న రవిచంద్రన్ అశ్విన్‌ను టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా చేయాలని అన్నారు. ప్రసాద్ మాట్లాడుతూ, “అంతర్జాతీయ క్రికెట్‌లో ఎనిమిదేళ్లకు పైగా గడిపిన తర్వాత, 46 టెస్టుల్లో 34 సగటు చాలా సాధారణం. ఇన్ని అవకాశాలు మరెవరికీ ఇచ్చారో గుర్తు లేదు’ అంటూ పేర్కొన్నాడు.

చాలా మంది తమ వంతు కోసం ఎదురుచూస్తూ అద్భుతమైన ఫామ్‌తో కాచుకుని ఉన్నారు. శుభమాన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. సర్ఫరాజ్ ఖాన్ ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో పరుగులు చేస్తున్నాడు. రాహుల్ కంటే ముందు ఎంపికకు అర్హులైన వారు చాలా మంది ఉన్నారు.

శనివారం వరుస ట్వీట్లలో “కొంతమందికి వారు విజయవంతమయ్యే వరకు అంతులేని అవకాశాలు ఇవ్వడం అదృష్టంగా ఉంటుంది. మరికొందరికి అలాంటి అవకాశాలు లభించవు” అని అన్నాడు. అయితే, రాహుల్ టాలెంట్, స్కిల్‌ని నేను గౌరవిస్తాను.. కానీ, అతని ప్రదర్శన చాలా తక్కువగా ఉందంటూ విమర్శలు గుప్పించాడు.

రాహుల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. పేలవమైన ప్రదర్శనలు ఉన్నప్పటికీ అతను టెస్ట్ జట్టులో ఉండటానికి ఇది కూడా ఒక కారణమని భారత మాజీ బౌలింగ్ కోచ్ ప్రసాద్ పేర్కొన్నాడు.

దీనితో పాటు, రాహుల్ స్థానంలో టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉండగల ఐదుగురు క్రికెటర్ల పేర్లను వెంకటేష్ ప్రసాద్ ప్రకటించాడు. “రాహుల్ టీమిండియాకు వైస్ కెప్టెన్‌గా నియమించిన తర్వాత మరింతగా చర్చనీయాంశమైంది. అశ్విన్‌కి క్రికెట్‌పై చాలా మంచి అవగాహన ఉంది. అతను టెస్ట్ ఫార్మాట్‌లో వైస్ కెప్టెన్‌గా ఉండాలి. రాహుల్ కంటే మయాంక్ అగర్వాల్, హనుమ విహారి టెస్టుల్లో మెరుగైన ప్రభావం చూపాడు.

మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us