Ricky Ponting: ఆ రోజు నా గదిలో చాలా జరిగింది.. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌పై రికీ పాంటింగ్‌ స్పందన..

IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్(Ricky Ponting) క్వారంటైన్‌లో గడిపిన తర్వాత తిరిగి జట్టులో చేరాడు. పాంటింగ్ కుటుంబ సభ్యునికి కరోనా(Corona) సోకింది...

Ricky Ponting: ఆ రోజు నా గదిలో చాలా జరిగింది.. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌పై రికీ పాంటింగ్‌ స్పందన..
Ponting (1)

Updated on: Apr 27, 2022 | 5:28 PM

ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్(Ricky Ponting) క్వారంటైన్‌లో గడిపిన తర్వాత తిరిగి జట్టులో చేరాడు. పాంటింగ్ కుటుంబ సభ్యునికి కరోనా(Corona) సోకింది. దాని కారణంగా అతను క్వారంటైన్‌లో ఉండవలసి వచ్చింది. పాటింగ్‌ క్వారంటైన్‌లో ఉన్నప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్(DC) జట్టు రాజస్థాన్ రాయల్స్‌తో తలపడింది. రిషబ్ పంత్ సారథ్యంలోని జట్టు ఈ మ్యాచ్‌లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మ్యాచ్ చివరి ఓవర్‌లో చిన్న వివాదం చెలరేగింది. అప్పుడు హోటల్లో మ్యాచ్‌ చూస్తున్న రికీ పాంటింగ్ ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో గదిలో చిన్న విధ్వంసమే జరిగింది. ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో అంపైర్ నిర్ణయంపై రిషబ్ పంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతను మైదానం నుంచి బయటకు రావాలని ఆటగాళ్లను కోరాడు. దీని తర్వాత అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేని కూడా మైదానంలోకి వెళ్లాడు. ఇలా చేసినందుకు వీళ్లకు జరిమానా కూడా విధించారు.

మ్యాచ్ గురించి రికీ పాంటింగ్ మాట్లాడుతూ ‘ఆ మ్యాచ్ చాలా కలవరపరిచింది. నేను తప్పనిసరిగా మూడు లేదా నాలుగు రిమోట్ కంట్రోళ్లను పగలగొట్టాను. కొన్ని నీటి సీసాలు పగిలిపోయాయి. ఆ పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది.’ అని చెప్పాడు. ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు మ్యాచ్‌లు ఆడగా నాలుగింటిలో ఓడిపోయింది. మూడు మ్యాచ్‌లు గెలిచింది. ఆరు పాయింట్లతో ఈ జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. “మేము ఒత్తిడిని తీసుకోకుండా, ఫామ్‌లోకి తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్నాం. మేము సానుకూలంగా ఉండాలి” అని రికీ పాంటింగ్ చెప్పాడు. మ్యాచ్‌ చివరి రెండు, మూడు ఓవర్లు మ్యాచ్‌ ఫలితాన్ని మారుస్తాయని పేర్కొన్నాడు.

Read Also.. Watch Video: స్థానం మారినా.. అదృష్టంలో మాత్రం నో ఛేంజ్.. మరోసారి విఫలమైన విరాట్.. ఫైరవుతోన్న ఫ్యాన్స్..

Loading...
Unable to load recommendations.
Follow Us