IPL 2022 Auction: ఐపీఎల్-2022 మెగా వేలంలో శిఖర్ ధావన్.. ఎవరు కొనుగోలు చేస్తారో తెలుసా..

స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఐపీఎల్-2022 మెగా వేలంలో పాల్గొననున్నాడు. ధావన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కోసం కొన్ని సీజన్‌లు ఆడిన తర్వాత, అతన్ని 2019లో ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది...

IPL 2022 Auction: ఐపీఎల్-2022 మెగా వేలంలో శిఖర్ ధావన్.. ఎవరు కొనుగోలు చేస్తారో తెలుసా..
Shikhar Dhawan

Updated on: Jan 22, 2022 | 8:31 PM

స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఐపీఎల్-2022 మెగా వేలంలో పాల్గొననున్నాడు. ధావన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కోసం కొన్ని సీజన్‌లు ఆడిన తర్వాత, అతన్ని 2019లో ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2020లో 600కి పైగా పరుగులు చేశాడు. ఫ్రాంచైజీ కోసం అతను ప్రతి సీజన్‌లో 500కి పైగా పరుగులు చేశాడు.

ఇప్పుడు అతడు IPL 2022 వేలంలోకి వెళుతున్నప్పుడు అతడిపైనే ఫ్రాంచైజీల కన్ను ఉండే అవకాశం ఉంటుంది. అతను సౌతాఫ్రికా సిరీస్​లో కూడా రాణిస్తుండడంతో అతడిపై ఫ్రాంచైజీలు దృష్టి సారించే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ క్వింటన్ డి కాక్‌ని విడుదల చేయడంతో, అతని స్థానంలో శిఖర్ ధావన్ సరైన ఎంపిక కావచ్చు. అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తున్న రోహిత్‌, ధావన్‌ జోడీని ఐపీఎల్‌లోనూ కొనసాగించాలని ముంబై చూస్తోంది.

KKR శుభమాన్ గిల్‌ను విడుదల చేయడంతో అతడి స్థానంలో అనుభవం గల శిఖర్ ధావన్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కేఎల్ రాహుల్​ను లక్నో సొంతం చేసుకుంది. ఇద్దరు బ్యాటర్‌లు మంచి ఓపెనింగ్ కాంబినేషన్‌ను కొనసాగించేందుకు వారు ధావన్‌ను కొనుగోలు చేయవచ్చు.
జట్టును పునర్నిర్మించాలని చూస్తున్నందున కింగ్స్​ ఎలెవన్ పంజాబ్​కు ధావన్ ఒక ఎంపిక కావచ్చు. IPL 2021 మెగా వేలానికి ముందు బెంగళూరు విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్‌లను కొనసాగించింది. వీరికి తోడు శిఖర్ ధావన్ తీసుకునే అవకాశం ఉంది.

Read Also.. IND vs SA: సౌతాఫ్రికాకు ఎదురుదెబ్బ.. స్లో ఓవర్ రేటుతో ఫైన్ విధించిన ఐసీసీ..