Indian Womens Cricket : 1983 క్షణం కోసం ఎదురుచూస్తున్న భారత మహిళల క్రికెట్.. 339 పరుగుల రికార్డు ఛేజింగ్‌తో కొత్త ఆశలు

క్రికెట్‌లో ఆస్ట్రేలియా అంటేనే ఒక తిరుగులేని శక్తి. అలాంటి పటిష్టమైన ఆసీస్ మహిళా జట్టు 15 మ్యాచ్‌ల వరల్డ్ కప్ విజయాల పరంపరను ఒక భారత జట్టు బద్దలు కొట్టింది. మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యధిక చేజింగ్‌గా నిలిచిన 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి, భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో చారిత్రక విజయాన్ని నమోదు చేసింది.

Indian Womens Cricket : 1983 క్షణం కోసం ఎదురుచూస్తున్న భారత మహిళల క్రికెట్.. 339 పరుగుల రికార్డు ఛేజింగ్‌తో కొత్త ఆశలు
Women's Odi World Cup 2025

Updated on: Nov 01, 2025 | 10:19 AM

Indian Womens Cricket : క్రికెట్‌లో ఆస్ట్రేలియా అంటేనే ఒక తిరుగులేని శక్తి. అలాంటి పటిష్టమైన ఆసీస్ మహిళా జట్టు 15 మ్యాచ్‌ల వరల్డ్ కప్ విజయాల పరంపరను ఒక భారత జట్టు బద్దలు కొట్టింది. మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యధిక చేజింగ్‌గా నిలిచిన 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి, భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం నవంబర్ 19, 2023న ఆస్ట్రేలియా చేతిలో రోహిత్ శర్మ జట్టు ఓటమి తర్వాత బాధపడిన భారత అభిమానులకు గొప్ప ఊరటనిచ్చింది. ఈ విజయం కేవలం సెమీ-ఫైనల్ విజయం మాత్రమే కాదు. భారత మహిళా క్రికెట్‌కు 1983 మొమెంట్‎గా నిలిచే గొప్ప మలుపు అని విశ్లేషకులు భావిస్తున్నారు.

భారత క్రికెట్ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆస్ట్రేలియాలో జరిగింది. మహిళల అంతర్జాతీయ ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యధిక చేజింగ్‌గా నిలిచిన 339 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించింది. ఆసీస్ మహిళా జట్టు వరల్డ్ కప్‌లలో సాధించిన 15 వరుస విజయాల పరంపర (2022 ప్రపంచకప్ టైటిల్‌తో సహా) ఈ ఒక్క విజయంతో బద్దలైంది.
గతంలో ఏ ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లోనూ భారత జట్టు 200 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేదు. కానీ ఈసారి జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఆ తర్వాత రిచా ఘోష్, అమన్జోత్ కౌర్ అద్భుతమైన ప్రదర్శనతో ఈ విజయాన్ని సాధించారు.

పెద్ద టోర్నమెంట్‌లో నాకౌట్ దశలో 300కు పైగా లక్ష్యాన్ని ఛేదించడం ఏ భారత జట్టు (పురుషులు లేదా మహిళలు) కూడా ఆస్ట్రేలియాపై చేయలేదు. ఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ నాయకత్వం కీలకంగా మారింది. లక్ష్యం భారీగా ఉన్నప్పటికీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ ఇద్దరూ ఒత్తిడికి లోను కాకుండా చాలా ప్రశాంతంగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ప్రదర్శన జట్టుపై నిరాశ చెంది, ఫాలో అవ్వడం మానేసిన అభిమానులలో మళ్లీ నమ్మకాన్ని పెంచింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చాలా బలంగా ఉన్నప్పటికీ భారత బౌలర్లు రేణుక సింగ్, శ్రీ చరణి, దీప్తి శర్మ, క్రాంతి గౌడ్ వంటివారు ఆస్ట్రేలియా స్కోరును 350 లోపు కట్టడి చేయగలిగారు.

ఈ విజయాన్ని క్రికెట్ విశ్లేషకులు 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలోని భారత జట్టు ప్రపంచ కప్ గెలిచిన సందర్భంతో పోలుస్తున్నారు. అంతకుముందు 2005, 2017లో భారత్ ఫైనల్‌కు చేరినా కీలక మ్యాచ్‌లలో తడబడుతుందని, చోకర్స్ అనే అపవాదు భారత మహిళా జట్టుపై ఉండేది. 300+ పరుగుల ఛేదనతో ఆ అపవాదు చెరిగిపోయింది. నవంబర్ 19, 2023న ఆస్ట్రేలియా చేతిలో రోహిత్ శర్మ జట్టు ఓడిపోయిన తర్వాత బాధలో ఉన్న యావత్ దేశం అక్టోబర్ 31న జరిగిన ఈ విజయంతో కొంత ఊరట పొందింది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్టుతో భారత్ తలపడనుంది. సెమీ ఫైనల్‌లో సాధించిన పురోగతిని ఫైనల్‌లో ఓడిపోతే కోల్పోవచ్చు. అయినప్పటికీ 338 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించడం ద్వారా భారత క్రికెట్‌లో ఒక గొప్ప మార్పు మొదలైందని చెప్పవచ్చు.

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us