టీ20 ప్రపంచకప్లో భాగంగా గురువారం గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇంగ్లండ్కు 172 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఉంచింది.
కెప్టెన్ రోహిత్ శర్మ 57 పరుగులు చేశాడు. ఇది ప్రపంచకప్లో అతనికి మూడో అర్ధ సెంచరీ. సూర్యకుమార్ 47 పరుగులు, హార్దిక్ పాండ్యా 13 బంతుల్లో 23 పరుగులతో ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టాడు.