IND vs WI: విండీస్ పర్యటనకు భారత జట్టు ప్రకటన.. కొత్త కెప్టెన్ సారథ్యంలో..

India Squad For West Indies: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది.

IND vs WI: విండీస్ పర్యటనకు భారత జట్టు ప్రకటన.. కొత్త కెప్టెన్ సారథ్యంలో..
Ind Vs Wi Shikhar Dhawan

Updated on: Jul 06, 2022 | 4:17 PM

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత క్రికెట్ జట్టును ప్రకటించారు. జట్టు కెప్టెన్సీ శిఖర్ ధావన్‌కు దక్కింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సీనియర్ సెలక్షన్ కమిటీ వెస్టిండీస్‌తో జరిగే ఈ 3 మ్యాచ్‌ల సిరీస్‌కి సంబంధించిన జట్టును నేడు ప్రకటించింది. ఊహించినట్లుగానే ఈ పర్యటనలో జట్టు కీలక సీనియర్, మల్టీ-ఫార్మాట్ ఆటగాళ్లకు విశ్రాంతిని ఇచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ వంటి పేర్లు ప్రముఖంగా ఉన్నాయి. అదే సమయంలో శుభమాన్ గిల్ వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు.

రెండోసారి కెప్టెన్‌గా ధావన్..

లెఫ్ట్‌ హ్యాండ్‌ వెటరన్‌ ఓపెనర్‌ ధావన్‌కి రెండోసారి టీమిండియా కమాండ్‌ లభించింది. దీనికి ముందు గతేడాది శ్రీలంక వెళ్లిన రెండో తరగతి భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ తర్వాత వన్డే, టీ20 సిరీస్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. మరోవైపు రవీంద్ర జడేజా తొలిసారిగా వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో జడేజా ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కానీ, అక్కడ విజయం సాధించలేకపోవడంతో, కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.

జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (కీపర్), సంజు శాంసన్ (కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్

ట్రినిడాడ్‌లో జులై 22న ప్రారంభమయ్యే వన్డే మ్యాచ్‌తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అనంతరం రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌లతో ఐదు T20Iలను కూడా ఆడనున్నారు. ట్రినిడాడ్, సెయింట్ కిట్స్, లాడర్‌హిల్ (ఫ్లోరిడా)లో మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే, చివరి రెండు టీ20లు ఆగస్టు 6, 7 తేదీల్లో అమెరికాలో జరగనున్నాయి.

Follow Us