Hardik Pandya: గుజరాత్ జట్టుతోనే హార్దిక్ పాండ్యా.. క్లారిటీ ఇచ్చిన ఫ్రాంచైజీ.. డిసెంబర్ 12 వరకు మారే ఛాన్స్?

Gujarat Titans: గత రెండు ఎడిషన్లలో గుజరాత్ జట్టుకు నాయకత్వం వహించిన హార్దిక్ పాండ్యా మరోసారి ఈ ఎడిషన్ నుండి తన పాత ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌లో చేరతాడని ఊహాగానాలు ఉన్నాయి. అయితే, తాజాగా గుజరాత్ ఫ్రాంచైజీ అధికారిక సమాచారం అందించింది. తాజాగా రిటెన్షన్ జాబితాను ప్రకటించి, అసలు విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

Hardik Pandya: గుజరాత్ జట్టుతోనే హార్దిక్ పాండ్యా.. క్లారిటీ ఇచ్చిన ఫ్రాంచైజీ.. డిసెంబర్ 12 వరకు మారే ఛాన్స్?
Hardik Pandya Gt Ipl 2023

Updated on: Nov 26, 2023 | 6:53 PM

హార్దిక్ పాండ్యా గురించి కొన్ని రోజులుగా వినిపిస్తున్న రూమర్స్ అన్నీ తప్పని తేలాయి. గత రెండు ఎడిషన్లలో గుజరాత్ జట్టుకు నాయకత్వం వహించిన హార్దిక్ పాండ్యా ఈ ఎడిషన్‌లో మరోసారి తన పాత ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌లో చేరతాడని ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఇప్పుడు గుజరాత్ ఫ్రాంచైజీ నుంచి అధికారిక సమాచారం బయటకు వచ్చింది. హార్దిక్‌ను తమ వద్దే ఉంచినట్లు ఫ్రాంచైజీ ప్రకటించింది.

ముంబైకి ఇంకా అవకాశం ఉందా?

అయితే హార్దిక్ ముంబై చేరే అవకాశం ఇంకా ఉంది. నిజానికి జట్టులోని ఆటగాళ్లను రిటైన్ చేయడానికి, విడుదల చేయడానికి అన్ని జట్లకు ఈరోజే చివరి రోజు. కానీ ఆటగాళ్ల ట్రేడ్ విండో డిసెంబర్ 12 వరకు యాక్టివ్‌గా ఉంటుంది. కాబట్టి, ట్రేడ్ ద్వారా హార్దిక్‌ను కొనుగోలు చేసేందుకు ముంబై జట్టుకు ఇంకా అవకాశం ఉంది. కాబట్టి, ట్రేడింగ్ ముగిసే వరకు హార్దిక్ గురించి ఏమీ చెప్పలేం.

ఇవి కూడా చదవండి

రింకూ దెబ్బకు బౌలర్ ఔట్..

గుజరాత్ ఫాస్ట్ బౌలర్ శివమ్ మావిని జట్టు నుంచి విడుదల చేసింది. 2022 సీజన్‌లో 6 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు తీసిన మావికి ఐపీఎల్ 2023లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం గుజరాత్ టైటాన్స్ ఇవ్వలేదు. గత సీజన్‌లో అతడిని జట్టు రూ.6 కోట్లకు చేర్చుకుంది. మరోవైపు, రింకూ సింగ్‌పై 5 బంతుల్లో 5 సిక్సర్లు కొట్టిన బౌలర్ యష్ దయాల్‌ను కూడా జట్టు విడుదల చేసింది.

జట్టు నుంచి విడుదలైన ఆటగాళ్లు: యశ్ దయాల్, కేఎస్ భరత్, శివమ్ మావి, ఉర్విల్ పటేల్, ప్రదీప్ సాంగ్వాన్, ఒడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్, దసున్ షనక.

రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితా: డేవిడ్ మిల్లర్, శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అభినవ్ మనోహర్, బి సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, మహ్మద్ షమీ, నూర్ ఎ. , R సాయి కిషోర్, రషీద్ ఖాన్, జోష్ లిటిల్, మోహిత్ శర్మ.

రూ.100 కోట్లకు చేరిన ఫ్రాంచైజీ పర్స్..

మినీ వేలంలో జట్ల పర్స్ రూ.5 కోట్ల నుంచి రూ.100 కోట్లకు పెరిగింది. అంటే, గతేడాది వరకు రూ.95 కోట్లుగా నిలిచిన పర్స్ విలువ, వచ్చే ఏడాదికి రూ. 5కోట్లు పెరిగి, 100 కోట్లకు చేరుకుంది.

రాబోయే వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసే సామర్థ్యం రిటెన్షన్ విండో ద్వారా నిర్ణయించబడుతుంది. ఒక జట్టు రూ. 10 కోట్ల విలువైన ఆటగాడిని విడుదల చేస్తే, వేలంలో రూ. 15 కోట్లు (10 కోట్లు + 5 కోట్ల అదనపు పర్స్) కొనుగోలు చేయగలుగుతారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..