Team India: టెస్ట్ కోచ్ పదవికి గంభీర్ రాజీనామా.. టీమిండియా స్టైలీష్ బ్యాటర్‌కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్..?

Team India head Coach Gautam Gambhir: టెస్టుల్లో వరుస పరాజయాల నేపథ్యంలో, బీసీసీఐ 'స్ప్లిట్ కోచింగ్' (పరిమిత ఓవర్లకు ఒకరు, టెస్టులకు మరొకరు) విధానాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం హైదరాబాదీ స్టైలీష్ ప్లేయర్ ను టెస్ట్ కోచ్‌గా రావాలని బీసీసీఐ కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) హెడ్‌గా ఉన్న సదరు ప్లేయర్, సీనియర్ జట్టు పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

Team India: టెస్ట్ కోచ్ పదవికి గంభీర్ రాజీనామా.. టీమిండియా స్టైలీష్ బ్యాటర్‌కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్..?
Goutam Gambhir Vvs Laxamn

Updated on: Dec 29, 2025 | 12:10 PM

Team India head Coach Post: మాజీ భారత ఓపెనర్ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత జట్టు ప్రదర్శన నిరంతరం పడిపోతోంది. ముఖ్యంగా టెస్టుల్లో గంభీర్ పగ్గాలు అందుకున్న తర్వాత భారత్ వరుస ఓటములను ఎదుర్కోవాల్సి వస్తోంది.

గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అయిన తర్వాత, భారత్ చరిత్రలో మొదటిసారిగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్‌కు గురైంది. ఇక ఇటీవలే దక్షిణాఫ్రికా కూడా భారత్‌ను వారి స్వదేశంలో 0-2తో టెస్ట్ సిరీస్‌లో ఓడించింది. దీంతో గంభీర్‌ను టెస్ట్ కోచ్ పదవి నుంచి తొలగించాలనే డిమాండ్ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో, బీసీసీఐ (BCCI) గంభీర్‌కు ఉద్వాసన పలికి, ఒక కొత్త ఆటగాడికి హెడ్ కోచ్ పదవిని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

గౌతమ్ గంభీర్ స్థానంలో ఈ ఆటగాడు హెడ్ కోచ్ అవుతారా?

కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో భారత టెస్ట్ జట్టు ప్రదర్శన దిగజారుతోంది. విదేశాల్లో సిరీస్ గెలవడం మాట పక్కన పెడితే, టీమిండియా స్వదేశంలో కూడా సిరీస్‌లను కాపాడుకోలేకపోతోంది. ఇదే కారణంతో బీసీసీఐ గంభీర్‌కు ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తోంది.

ఇవి కూడా చదవండి

నివేదికల ప్రకారం, బీసీసీఐ అధికారి ఒకరు భారత మాజీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను సంప్రదించి, ఆయన అభిప్రాయాన్ని కోరారు. అయితే, లక్ష్మణ్‌తో ఈ చర్చలు అనధికారికంగా జరిగాయి. ఆయన ఈ పదవిని చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నారా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేశారు.

వీవీఎస్ లక్ష్మణ్ ఇచ్చిన సమాధానం ఏమిటి?

టెస్ట్ జట్టు ప్రధాన కోచ్ పదవి గురించి చర్చించినప్పుడు, వీవీఎస్ లక్ష్మణ్ బెంగళూరులోని ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ (గతంలో NCA) క్రికెట్ హెడ్‌గా కొనసాగడంపైనే తనకు సంతోషంగా ఉందని స్పష్టం చేశారు. అంటే, ప్రస్తుతానికి లక్ష్మణ్ ఈ బాధ్యతలు స్వీకరించడానికి ఆసక్తి చూపడం లేదని స్పష్టమైంది. దీంతో బీసీసీఐ ప్రస్తుతానికి గంభీర్‌తోనే ముందుకు సాగాల్సి ఉంటుంది.

అయితే, ఈ పరిణామాల తర్వాత బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఒక ప్రకటన విడుదల చేశారు. గౌతమ్ గంభీర్ టెస్ట్ కోచింగ్‌కు సంబంధించి ఎవరితోనూ చర్చలు జరపలేదని, వేరే కోచ్‌ను సంప్రదించలేదని ఆయన తెలిపారు. ఇవన్నీ కేవలం పుకార్లేనని ఆయన కొట్టిపారేశారు.

గతంలో హెడ్ కోచ్‌గా వ్యవహరించిన సందర్భాలు..

భారత మిడిల్ ఆర్డర్ వెన్నెముకగా పేరుగాంచిన వీవీఎస్ లక్ష్మణ్, 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ తర్వాత ఆయన పలు సందర్భాల్లో భారత జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించారు.

  • జూన్ 2022లో ఐర్లాండ్ పర్యటనలో ఆయన మొదటిసారిగా హెడ్ కోచ్ బాధ్యతలు నిర్వహించారు.
  • ఆగస్టు 2022లో జింబాబ్వే పర్యటనకు కూడా ఆయనే కోచ్‌గా వెళ్లారు.
  • అదే నెలలో అప్పటి కోచ్ రాహుల్ ద్రవిడ్ కోవిడ్-19 బారిన పడటంతో ఆసియా కప్ కోసం లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా ఉన్నారు.
  • అక్టోబర్-నవంబర్ 2024లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కు కూడా లక్ష్మణ్‌నే హెడ్ కోచ్‌గా నియమించారు. ఎందుకంటే ఆ సమయంలో గంభీర్ టెస్ట్ జట్టుతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు.
  • అంతేకాకుండా, జూన్ 2025లో ఇంగ్లాండ్ టెస్ట్ పర్యటన సమయంలో గంభీర్ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి తిరిగి రావడంతో లక్ష్మణ్ తాత్కాలికంగా ఆ బాధ్యతలు చేపట్టారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..