CWG 2022: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. ఫైనల్లో సత్తా చాటిన తెలంగాణ ముద్దుబిడ్డ..

|

Aug 07, 2022 | 7:33 PM

ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో అమిత్ పంఘల్, నీతూ విజయం సాధించి భారత్ బంగారు పతకాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది.

CWG 2022: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. ఫైనల్లో సత్తా చాటిన తెలంగాణ ముద్దుబిడ్డ..
Cwg 2022 Nikhat Zareen
Follow us on

బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న 22వ కామన్వెల్త్ గేమ్స్‌లో 10వ రోజు మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. బాక్సింగ్‌లో భారత్‌ మూడు బంగారు పతకాలు సాధించింది. తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ 50 కిలోల బరువు విభాగంలో నార్తర్న్ ఐలాండ్‌కు చెందిన కార్లీ మెక్‌నాల్‌ను 5-0తో ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకుంది. శనివారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత స్టార్ బాక్సర్, ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ నిఖత్ 5-0తో ఇంగ్లండ్ బాక్సర్ సవన్నా అల్ఫియాపై విజయం సాధించింది. కామన్వెల్త్‌లో నిఖత్‌కు ఇదే తొలి బంగారు పతకం కావడం విశేషం.

నీతు ఘంఘాస్ (48 కేజీలు), అమిత్ పంఘల్ (51 కేజీలు) తమ తమ వెయిట్ కేటగిరీల్లో స్వర్ణం సాధించారు. అదే సమయంలో, పురుషుల ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణం, రజతం రెండూ లభించాయి. భారత్‌కు చెందిన ఆల్డోస్ పాల్ 17.03 మీటర్లు జంప్ చేసి స్వర్ణం సాధించాడు. భారత్‌కు చెందిన అబ్దుల్లా అబుబకర్ 17.02 మీటర్లు దూకి రజతం సాధించాడు. పురుషుల ట్రిపుల్ జంప్‌లో ఇద్దరు భారత క్రీడాకారులు స్వర్ణం, రజతం సాధించడం కామన్వెల్త్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

ప్రస్తుత సీజన్‌లో భారత్‌ ఖాతాలో 17 స్వర్ణాలు చేరాయి. దీంతో మొత్తం పతకాల సంఖ్య 48కి చేరుకుంది. భారత్‌కు 12 రజతాలు, 19 కాంస్యాలు కూడా వచ్చాయి. మొత్తంగా పతకాల పట్టికలో 4వ స్థానానికి భారత్ చేరుకుంది.