
హిందూ మతంలో అమర్నాథ్ యాత్ర చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శివయ్య భక్తులు ఈ యాత్ర కోసం ఎంతో ఆనందంగా ఎదురు చూస్తున్నారు. అమర్నాథ్ గుహ జమ్మూ కాశ్మీర్లో 3888 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ గుహలో సహజంగా మంచు శివలింగంగా ఏర్పడుతుంది. దీనిని హిందూ మతంలో శివుని చిహ్నంగా భావిస్తారు. శివలింగాన్ని పోలి ఉండే ఈ ఆకారం 15 రోజుల పాటు ప్రతిరోజూ కొద్దిగా పెరుగుతూనే ఉంటుంది. అంటే 15 రోజుల్లో ఈ మంచు శివలింగం ఎత్తు 2 గజాల కంటే ఎక్కువ అవుతుంది. తర్వాత 16వ రోజు నుంచి శివలింగం పరిమాణం తగ్గుతూ వస్తుంది. అంటే చంద్రుడు క్షీణిస్తున్న కొద్దీ శివలింగం పరిమాణం కూడా తగ్గడం ప్రారంభమవుతుంది. చంద్రుడు అదృశ్యమయ్యే కొద్దీ శివలింగం కూడా అదృశ్యమవుతుంది. ఈ గుహను 15వ శతాబ్దంలో ఒక ముస్లిం గొర్రెల కాపరి కనుగొన్నాడు.
2025 సంవత్సరంలో అమర్నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభమై ఆగస్టు 9న ముగుస్తుంది. ఈ పవిత్ర ప్రయాణానికి రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 24 నుంచి ఆన్లైన్ మోడ్ ద్వారా ప్రారంభమైంది. దీని కోసం యాత్రికులు శ్రీ అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆఫ్లైన్లో, ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. శ్రీ అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డుకు భారతదేశం అంతటా 540 కంటే ఎక్కువ బ్యాంకు శాఖలు ఉన్నాయి. అక్కడ కూడా భక్తులు తమ పేరుని నమోదు చేసుకోవచ్చు.
అమర్నాథ్ యాత్రకు ఆఫ్లైన్లో నమోదు చేసుకోవాలనుకునే వారు రిజిస్ట్రేషన్ సెంటర్ లేదా బ్యాంక్ బ్రాంచ్కు వెళ్ళాల్సి ఉంది. సాధారణంగా యాత్రకు ఎంచుకున్న రోజుకు మూడు రోజుల ముందు వైష్ణవి ధామ్, పంచాయతీ భవన్, మహాజన్ హాల్ వంటి ప్రదేశాలలో టోకెన్ ద్వారా స్లిప్లను పంపిణీ చేస్తారు. యాత్రికులు మర్నాడు అధికారిక రిజిస్ట్రేషన్, వైద్య పరీక్షల కోసం సరస్వతి ధామ్కు వెళ్లాలి. యాత్రికులు జమ్మూలోని నిర్దిష్ట ప్రదేశాల నుంచి తమ RFID కార్డులను సేకరించాల్సి ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు