కరోనా భయంతో కిరాణా యజమాని కొత్త ఆలోచన.. కుక్కర్లో కరెన్సీకి ఆవిరి..
కరోనా వైరస్ భయంతో ఓ కిరాణా షాపు యజమాని కొత్తగా ఆలోచించాడు. కరెన్సీ నోట్ల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఎలక్ట్రానిక్ కుక్కర్లో కరెన్సీకి ఆవిరి..
కరోనా వైరస్ భయంతో ఓ కిరాణా షాపు యజమాని కొత్తగా ఆలోచించాడు. కరెన్సీ నోట్ల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఎలక్ట్రానిక్ కుక్కర్లో కరెన్సీకి ఆవిరి పట్టిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా కైకలూరులో నరసింహారావు అనే వ్యక్తి విజయలక్ష్మీ కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నరసింహారావు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో తన షాపులో సరుకులు కొనుగోలు చేసేందుకు వచ్చినవారు ఇచ్చే నగదును శానిటైజ్ చేస్తున్నాడు.
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ద్వారా కరెన్సీని ఆవిరి పడుతున్నాడు. ఈ ఆవిరి ద్వారా కరెన్సీ నోట్లపై ఏమైనా వైరస్ ఉంటే చనిపోయే ప్రమాదం ఉండటంతో కుక్కర్ అడుగు భాగంలో నీళ్లు పోసి మధ్యలో రంధ్రాలున్న ప్లేటును అమర్చాడు. నీరు వేరు కావడం ద్వారా వచ్చే ఆవిరితో కరెన్సీ నోట్లను శానిటైజ్ చేస్తున్నాడు నరసింహారావు. దీంతో నోట్లపై ఉన్న వైరస్ చనిపోతుందని ఆయన అభిప్రాయం.
కాగా ఏపీలో ఆదివారం నాటికి కరోనా వైరస్ కేసులు 1097కి చేరుకున్నాయి. గత 24 గంటల్లో కృష్ణా జిల్లాలో 52 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం కరోనా వైరస్ను వ్యాప్తి చెందకుండా పలు జాగ్రత్తలు తీసుకొంటుంది.
Read More:
తెలంగాణలో ఇకపై ఆ పేర్లు ఉండవ్.. కేసీఆర్ కీలక నిర్ణయం
లాక్డౌన్ ఫ్రస్ట్రేషన్ తెలిపితే.. డబ్బులే డబ్బులు!
అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు!