‘ఏ కిసీ కి బాప్ కి జాగిర్ నహీ’ – శత్రుఘ్న సిన్హా
బాలీవుడ్లో నెపోటిజంపై యుద్ధం చేస్తున్న క్వీన్ కంగనా రనౌత్కు సీనియర్ నటుడు, మాజీ ఎంపీ శత్రుఘ్న సిన్హా మద్దతుగా నిలిచారు. ఎలాంటి అండదండలు లేకుండా నటిగా ఎదిగిన కంగనాపై ఈర్ష్య, అసూయలతోనే ఆమెను కొంతమంది విమర్శిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ” ఏ కిసీ కి బాప్ కి జాగిర్ నహీ” అంటూ కొందరు బీ నగర్ ప్రముఖులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య అనంతరం బాలీవుడ్ పెద్దలపై కంగనా […]
బాలీవుడ్లో నెపోటిజంపై యుద్ధం చేస్తున్న క్వీన్ కంగనా రనౌత్కు సీనియర్ నటుడు, మాజీ ఎంపీ శత్రుఘ్న సిన్హా మద్దతుగా నిలిచారు. ఎలాంటి అండదండలు లేకుండా నటిగా ఎదిగిన కంగనాపై ఈర్ష్య, అసూయలతోనే ఆమెను కొంతమంది విమర్శిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ” ఏ కిసీ కి బాప్ కి జాగిర్ నహీ” అంటూ కొందరు బీ నగర్ ప్రముఖులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య అనంతరం బాలీవుడ్ పెద్దలపై కంగనా రనౌత్ దాడి చేస్తున్న సంగతి తెలిసిందే.. పరిశ్రమలోని బంధుప్రీతి, కొందరు వ్యక్తుల ఆధిపత్య ధోరణుల వల్లే సుశాంత్ బలవన్మరణానికి పాల్పడ్డారని ఆమె ఆరోపణలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా అగ్ర దర్శకనిర్మాత కరణ్జోహార్ను టార్గెట్ చేసుకొని కంగనా రనౌత్ విమర్శలు సంధిస్తున్నారు. కంగనా కామెంట్స్ పై బాలీవుడ్లోని ఓ వర్గం తీవ్రస్థాయిలో దాడి చేస్తోంది.
ఈ వివాదం నేపథ్యంలో కంగనాకు తన మద్దతు ఉంటుందని ప్రకటించారు సీనియర్ నటుడు, మాజీ ఎంపీ శత్రుఘ్న సిన్హా. ఓ జాతీయ ఛానల్తో మాట్లాడిన ఆయన.. కంగనారనౌత్పై విమర్శలు చేస్తున్నవారంతా పరిశ్రమలో ఆమె ఉన్నతిని చూసి జెలసీతో ఉన్నారని అన్నారు. చిత్రసీమ ఏ ఒక్క వ్యక్తికో చెందనది కాదని, ఇక్కడ ఎవరు ఎవరినీ వెళ్లగొట్టలేరని..సినీరంగంలో పనిచేసేవారంతా తాము ఎన్ని కష్టాలు పడి ఎదిగామో గుర్తుంచుకోవాలని శతృఘ్న సిన్హా హితవు పలికారు.