భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 10,880, సెన్సెక్స్ 342 పెరిగి 36,213 వద్ద ముగిసింది. టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు చెరో 3శాతం లాభపడటంతో మార్కెట్ దూసుకెళ్లింది. ఈ ఏడాది ప్రారంభంతో పోలిస్తే ఇప్పుడు మళ్లీ లాభాల్లోకి మళ్లింది. సోమవారం భారీగా విదేశీ పెట్టుబడులు రాక పెరిగిపోవడం, దేశీయ సంస్థాగత మదుపరులు కొనుగోళ్లు చేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. దూసుకెళ్లిన షేర్లు.. విప్రో షేర్లు 19ఏళ్లలో అత్యధిక […]
ముంబయి: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 10,880, సెన్సెక్స్ 342 పెరిగి 36,213 వద్ద ముగిసింది. టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు చెరో 3శాతం లాభపడటంతో మార్కెట్ దూసుకెళ్లింది. ఈ ఏడాది ప్రారంభంతో పోలిస్తే ఇప్పుడు మళ్లీ లాభాల్లోకి మళ్లింది. సోమవారం భారీగా విదేశీ పెట్టుబడులు రాక పెరిగిపోవడం, దేశీయ సంస్థాగత మదుపరులు కొనుగోళ్లు చేయడంతో ఈ పరిస్థితి నెలకొంది.
దూసుకెళ్లిన షేర్లు.. విప్రో షేర్లు 19ఏళ్లలో అత్యధిక స్థాయిలో ట్రేడ్ అయ్యాయి. దాదాపు 4.5శాతం ఎగసి రూ.396 వద్ద ముగిశాయి. మార్చి7వ తేదీన షేర్ హోల్డర్లకు బోనస్ షేర్లను ప్రకటించనుండటంతో కొనుగోళ్లు జరిగాయి. న్యూల్యాండ్ లేబోరేటరీ షేర్లు 18శాతం ఎగసి రూ.760 మార్కును తాకింది. ఇటీవల కంపెనీ నికర లాభం ఆరు రెట్లు పెరిగింది. మరోపక్క ట్రంప్ చైనాపై టారిఫ్ల విషయంలో వేచి చూసే ధోరణి అవలంభించడంతో మార్కెట్లు భారీగా పుంజుకొన్నాయి.