రాష్ట్రంలో 16 శాతం మందిలో కోవిడ్ యాంటీబాడీలు, కర్నాటక మంత్రి
తమ రాష్ట్రంలో కోవిడ్ సోకి కోలుకున్న 16 శాతం మందికి పైగా రోగుల్లో యాంటీబాడీలు పెరిగాయని ఇటీవలి సీరో సర్వే ద్వారా తేలిందని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్ తెలిపారు. సెప్టెంబరు 3-16 తేదీల మధ్య ఈ సర్వే జరిగిందని బుధవారం మీడియాకు వెల్లడించారు. మొత్తం 30 జిల్లాల్లో 16,585 మందిపై ఈ సర్వే నిర్వహించామని ఆయన చెప్పారు. వీరంతా 18, అంతకంటే వయస్సు పైబడినవారేనని సుధాకర్ అన్నారు. గతంలో కరోనా వైరస్ కి గురై […]
తమ రాష్ట్రంలో కోవిడ్ సోకి కోలుకున్న 16 శాతం మందికి పైగా రోగుల్లో యాంటీబాడీలు పెరిగాయని ఇటీవలి సీరో సర్వే ద్వారా తేలిందని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్ తెలిపారు. సెప్టెంబరు 3-16 తేదీల మధ్య ఈ సర్వే జరిగిందని బుధవారం మీడియాకు వెల్లడించారు. మొత్తం 30 జిల్లాల్లో 16,585 మందిపై ఈ సర్వే నిర్వహించామని ఆయన చెప్పారు. వీరంతా 18, అంతకంటే వయస్సు పైబడినవారేనని సుధాకర్ అన్నారు. గతంలో కరోనా వైరస్ కి గురై కోలుకున్న వీరంతా ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని ఆయన తెలిపారు. వీరిలో రోగ నిరోధక శక్తి పెరిగినట్టు గుర్తించామన్నారు.