రాజ్ తరుణ్ కొత్త మూవీ.. ఆ నలుగురి ఆశలను తీరుస్తుందా..?
‘గుండె జారి గల్లంతయ్యిందే’ దర్శకుడు విజయ్ కుమార్ కొండకు యువ హీరో రాజ్ తరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఇవాళ హైదరాబాద్లో జరిగాయి. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ పాల్గొంది. ఇక ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఆగష్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై రాధా మోహన్ నిర్మిస్తోన్న ఈ మూవీకి అనూప్ రూబెన్స్ […]
‘గుండె జారి గల్లంతయ్యిందే’ దర్శకుడు విజయ్ కుమార్ కొండకు యువ హీరో రాజ్ తరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఇవాళ హైదరాబాద్లో జరిగాయి. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ పాల్గొంది. ఇక ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. ఆగష్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై రాధా మోహన్ నిర్మిస్తోన్న ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన అదితీరావు హైదరీ నటించబోతున్నట్లు సమాచారం.
కాగా గతేడాది రాజ్ తరుణ్ నటించిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. దీంతో ఈ సారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు ఈ హీరో. మరోవైపు ‘గుండెజారి గల్లంతయ్యిందే’తో హిట్ కొట్టినప్పటికీ.. ఆ తరువాత ‘ఒక లైలా కోసం’ మూవీతో మళ్లీ డీలా పడ్డాడు విజయ్ కుమార్ కొండ. ఇక నిర్మాత రాధా మోహన్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్లు కూడా ఫ్లాప్ల్లోనే ఉన్నారు. దీంతో ఈ మూవీపైనే ఈ నలుగురు భారీ ఆశలను పెట్టుకున్నారు.