భారత చిత్ర పరిశ్రమ సంచలన నిర్ణయం
పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ.. పాకిస్థాన్ కళాకారులతో కలిసి పనిచేయకూడదని భారత చిత్ర పరిశ్రమ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాక్ కళాకారుల్ని నిషేధిస్తున్నట్లు ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోషియేషన్ ప్రకటన విడుదల చేసింది. దీన్ని ఉల్లంఘించిన సంస్థను నిషేధిస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తాజాాగా సల్మాన్ ఖాన్ ‘భారత్’ సినిమాలో పాటలు పాడిని పాకిస్థాన్ సింగర్స్ అతిఫ్ అస్లాం, రహతే ఫతే అలీ ఖాన్లను తొలగించారు. వారి స్థానంలో భారత […]
పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ.. పాకిస్థాన్ కళాకారులతో కలిసి పనిచేయకూడదని భారత చిత్ర పరిశ్రమ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాక్ కళాకారుల్ని నిషేధిస్తున్నట్లు ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోషియేషన్ ప్రకటన విడుదల చేసింది. దీన్ని ఉల్లంఘించిన సంస్థను నిషేధిస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో తాజాాగా సల్మాన్ ఖాన్ ‘భారత్’ సినిమాలో పాటలు పాడిని పాకిస్థాన్ సింగర్స్ అతిఫ్ అస్లాం, రహతే ఫతే అలీ ఖాన్లను తొలగించారు. వారి స్థానంలో భారత గాయకుల్ని తీసుకొని.. వారితో పాటల్ని రికార్డు చేయనున్నారు. కాగా ‘భారత్’ మూవీలో సల్మాన్ హీరోగా, కత్రినా కైఫ్ హీరోయిన్గా నటిస్తోంది. దిశా పటానీ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలీ అబ్బాస్ జఫార్ దర్శకత్వం వహిస్తున్నారు.