శ్రీవారిని దర్శించుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు దంపతులు
తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. మొదటిసారి తన సతీమణి తేజస్వినితో కలిసి దిల్ రాజు శ్రీవారిని దర్శించారు. శనివారం ఉదయం సతీ సమేతంగా స్వామివారిని దర్శించుకుని..
తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. మొదటిసారి తన సతీమణి తేజస్వినితో కలిసి దిల్ రాజు శ్రీవారిని దర్శించారు. శనివారం ఉదయం సతీ సమేతంగా స్వామివారిని దర్శించుకుని.. తలనీలాలు సమర్పించుకున్నారు దిల్ రాజు. ముఖానికి మాస్క్ పెట్టుకున్నా కూడా ఆయన్ని గుర్తు పట్టిన అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. కాగా దిల్ రాజు లాక్డౌన్ సమయంలోనే పెళ్లి బాజాలు మోగించిన విషయం తెలిసిందే. మే 10వ తేదీన నిజామాబాద్ జిల్లాని నర్సింగ్ పల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు దిల్ రాజు. ఇది ఆయనకి రెండో పెళ్లి. దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.
Read More:
వాహనదారులపై భారీ భారం.. 15 రోజుల్లో రూ.8 పెరుగుదల..
బ్రేకింగ్: కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీహెచ్కి కరోనా పాజిటివ్..
విపరీతంగా కరోనా కేసులు.. ఉద్యోగులకు కీలక మార్గదర్శకాలు: హైకోర్టు