హైదరాబాద్‌కి రానున్న ‘రాధే శ్యామ్’‌ టీమ్‌..!

రెబల్‌ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం రాధే శ్యామ్‌. రొమాంటిక్ ప్రేమ కథగా తెరకెక్కుతున్న

హైదరాబాద్‌కి రానున్న 'రాధే శ్యామ్'‌ టీమ్‌..!
Follow us

| Edited By:

Updated on: Oct 31, 2020 | 2:09 PM

Prabhas radhe Shyam: రెబల్‌ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం రాధే శ్యామ్‌. రొమాంటిక్ ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. అయితే యూరప్ దేశాల్లో ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. అక్కడి దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయ్యింది. దీంతో ఆయా దేశాల్లో మళ్లీ కఠిన ఆంక్షలు పెడుతున్నారు. ఇక రాధే శ్యామ్‌ ఇటలీ షెడ్యూల్‌ ఈ వారానికి పూర్తి అవ్వబోతుందట. ఈ నేపథ్యంలో రాధే శ్యామ్ టీమ్‌ త్వరలోనే హైదరాబాద్‌కి రానున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మిగిలిన షూటింగ్‌ని పూర్తి చేయబోతున్నట్లు సమాచారం. (మహేష్‌, పూరీలను కలపబోతున్న ఆ నిర్మాత..!)

కాగా ఈ మూవీలో విక్రమాదిత్యగా ప్రభాస్ కనిపించనుండగా.. పూజా ప్రేరణగా నటిస్తున్నారు. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి జస్టిన్ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోన్న రాధే శ్యామ్‌ని పలు భాషల్లో వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. ( 15 నెలల బంగారం చోరీ కేసు: దొంగను పట్టించిన వాట్సాప్ స్టేటస్‌)