Prabhas 21: ఆ బాలీవుడ్ భామనే కావాలంటోన్న ప్రభాస్.. ఈ సారైనా ఓకే చెప్తుందా..!

ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 20వ చిత్రంలో నటిస్తోన్న ప్రభాస్.. ఆ తరువాత మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించబోతున్న విషయం తెలిసిందే. సై ఫై కథాంశంతో తెరకెక్కబోతున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Prabhas 21: ఆ బాలీవుడ్ భామనే కావాలంటోన్న ప్రభాస్.. ఈ సారైనా ఓకే చెప్తుందా..!
Follow us

| Edited By:

Updated on: Mar 10, 2020 | 6:40 PM

ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 20వ చిత్రంలో నటిస్తోన్న ప్రభాస్.. ఆ తరువాత మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించబోతున్న విషయం తెలిసిందే. సై ఫై కథాంశంతో తెరకెక్కబోతున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం దానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దాదాపు 400కోట్లతో పాన్ వరల్డ్ మూవీగా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో కాస్టింగ్ విషయంలో ఆయన చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌ను తీసుకోవాలని ప్రభాస్ సూచించారట. ఈ నేపథ్యంలో ఆమెతో సంప్రదింపులు చేయాలని దర్శకుడు అనుకుంటున్నట్లు సమాచారం.

అయితే సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సాహో చిత్రం కోసం మొదట కత్రినాను తీసుకోవాలని అనుకున్నారు. ఆ నేపథ్యంలో ఆమెతో సంప్రదింపులు జరిపినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆమె డేట్లు అడ్జెస్ట్ చేయలేకపోవడంతో.. ఆ ఆఫర్ శ్రద్ధాను వరించినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు తన తదుపరి చిత్రం కోసం.. మరోసారి కత్రినాను కలవాలని ప్రభాస్ భావిస్తున్నట్లు సమాచారం. మరి ఈ సారైనా ప్రభాస్ కోసం కత్రినా ఓకే చెప్తుందో లేదో చూడాలి. కాగా కెరీర్ ప్రారంభంలో తెలుగులో మల్లీశ్వరి, అల్లరి పిడుగు చిత్రాల్లో కత్రినా నటించింది. ఆ తరువాత హిందీలో వరుస విజయాలు సొంతం చేసుకొని బిజీగా మారింది. ఇక ఇప్పుడు ప్రభాస్ కోసం ఒప్పుకుంటే దాదాపు 15 సంవత్సరాల తరువాత కత్రినా టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

Read This Story Also: వరల్డ్ కప్‌ ఫైనల్‌లో ‘పక్కా లోకల్’.. అంతర్జాతీయంగా మరోసారి ‘రాక్‌స్టార్’ క్రేజ్..!