Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా రాష్ట్రాన్ని బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు, కానీ వారి ఆటలు సాగవు, పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్,

తమ రాష్ట్రాన్ని బీజేపీ నేతలు టార్గెట్ గా పెట్టుకున్నారని పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ ఆరోపించారు.

మా రాష్ట్రాన్ని బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు, కానీ వారి ఆటలు సాగవు, పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్,
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Jan 03, 2021 | 9:47 PM

తమ రాష్ట్రాన్ని బీజేపీ నేతలు టార్గెట్ గా పెట్టుకున్నారని పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ ఆరోపించారు. పైగా గవర్నర్ పదవి స్థాయిని దిగజారుస్తున్నారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య బధ్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాల్జేసే కుట్రకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు., వీళ్ళు రాజ్యాంగంలోని  ఏబీసీ లను కూడా నేర్చుకోవాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అధికారం కోసం అంగలారుస్తున్న బీజేపీ తమ రాజకీయ ప్రయోజనాలకోసం గవర్నర్ పదవిని వినియోగించుకుంటోందన్నారు. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలలో కూడా ఈ పార్టీ చేస్తున్న కుయుక్తులు ఇన్నీ అన్నీ కావు, కానీ  వారి ఆటలు ఇక్కడ సాగవన్నారు. పంజాబ్ మరో బెంగాల్ గా మారుతోందన్న కమలం పార్టీ నాయకుల ఆరోపణను ఖండించిన అమరేందర్ సింగ్.. మొదట మీ పార్టీ పాలిత రాష్ట్రాల సంగతిని చూసుకోవాలని తీవ్రంగా వ్యాఖ్యానించారు.

ఇటీవల రైతులు కొందరు సెల్ టవర్లను నాశనం చేయడంపై స్పందించిన గవర్నర్… వివరణ కోసం   ఉన్నతాధికారులకు సమన్లు  జారీ చేయడాన్ని సీఎం మళ్ళీ ప్రస్తావించారు. దీని వెనుక  బీజేపీ కుట్ర ఉందన్నారు.   పంజాబ్ ముఖ్యమంత్రి…. కాషాయ పార్టీపై ఇంతగా నిప్పులు కక్కడం ఇదే మొదటిసారి.