కొత్త పార్టీ ఏర్పాటు దిశగా వైఎస్ షర్మిళ దూకుడు, ఈనెల 20న ఖమ్మం జిల్లా అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం

తెలంగాణలో సరికొత్త రాజకీయపార్టీ 'వైఎస్ఆర్ టీపీ' కార్యాచరణపై వైఎస్ షర్మిళ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నిన్న హైదరాబాద్ లోటస్ పాండ్ లో..

కొత్త పార్టీ ఏర్పాటు దిశగా వైఎస్ షర్మిళ దూకుడు, ఈనెల 20న ఖమ్మం జిల్లా అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం

Updated on: Feb 10, 2021 | 6:50 PM

తెలంగాణలో సరికొత్త రాజకీయపార్టీ ‘వైఎస్ఆర్ టీపీ’ కార్యాచరణపై వైఎస్ షర్మిళ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నిన్న హైదరాబాద్ లోటస్ పాండ్ లో నల్గొండ జిల్లా నేతలతో భేటీ అయిన ఆమె, ఈనెల 20న ఖమ్మం జిల్లా దివంగత రాజన్న అభిమానులతో సమావేశం కానున్నారు. అంతేకాకుండా, వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాన్ని కూడా నిర్వహించే యోచనలో ఉన్నారు. ఇక హైదరాబాద్‌లో పార్టీకి కొత్త కార్యాలయం చూడాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో చేరికలపై పూర్తిస్థాయి పరిశీలన చేయబోతున్నారు షర్మిళ. తన కొత్త పార్టీ వైఎస్ఆర్ టీపీలో కొత్తవారికి అవకాశం ఇచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నారామె.

తెలంగాణలో చర్చంతా కొత్త జెండా పైనే, షర్మిళ ఎవరు వదిలిన బాణమని సర్వత్రా మీమాంస.!

Loading...
Unable to load recommendations.
Follow Us