పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో స్పీడ్‌ పెంచిన ఎస్‌ఈసీ.. శాంతిభద్రతల పర్యవేక్షణకు ఐజీ స్థాయి అధికారి నియామకం

|

Jan 26, 2021 | 6:13 PM

పంచాయతీ ఎన్నికల్లో శాంతిభద్రతల పర్యవేక్షణకు ఐజీ స్థాయి అధికారిని నియమించింది నిమ్మగడ్డ రమేష్‌కుమర్‌. డాక్టర్‌ సంజయ్‌ని..

పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో స్పీడ్‌ పెంచిన ఎస్‌ఈసీ.. శాంతిభద్రతల పర్యవేక్షణకు ఐజీ స్థాయి అధికారి నియామకం
Follow us on

ఏపీ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ స్పీడ్‌ పెంచారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు కావాల్సిన అన్ని హంగులను సమకూర్చుకుంటున్నారు. ఇప్పటికే విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై బదిలీ వేటు వేసిన ఎస్‌ఈసీ శాంతి భద్రతల అంశంపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది.

పంచాయతీ ఎన్నికల్లో శాంతిభద్రతల పర్యవేక్షణకు ఐజీ స్థాయి అధికారిని నియమించింది నిమ్మగడ్డ రమేష్‌కుమర్‌. డాక్టర్‌ సంజయ్‌ని శాంతిభద్రతల పర్యవేక్షణ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏకగ్రీవాలు, హింస, అల్లర్లు, కోడ్‌ ఉల్లంఘనలను ఐజీ సంజయ్‌ పర్యవేక్షిస్తారు. ఈ మేరకు ఆయన SECని కలిసి రిపోర్ట్‌ చేశారు.