రాహుల్ తెలంగాణ రాకకు ముహూర్తం ఖరారు

| Edited By:

Mar 28, 2019 | 8:58 AM

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాకకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ ఒకటో తేదిన రాహుల్ రాష్ట్రానికి రానున్నారు. ఈ సందర్భంగా మూడు లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో నిర్వహించే బహిరంగ సభల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన ఇచ్చిన పీసీసీ జహీరాబాద్, నాగర్‌కర్నూల్, నల్గొండలలో రాహుల్ పర్యటించనున్నారని స్పష్టం చేసింది. ఏప్రిల్ 1 మధ్యాహ్నం 12గంటలకు జహీరాబాద్ సభ, 2 గంటలకు నాగర్‌కర్నూల్ సెగ్మెంట్ వనసర్తిలో, సాయంత్రం 4గంటలకు నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ ఎన్నికల […]

రాహుల్ తెలంగాణ రాకకు ముహూర్తం ఖరారు
Follow us on

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాకకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ ఒకటో తేదిన రాహుల్ రాష్ట్రానికి రానున్నారు. ఈ సందర్భంగా మూడు లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో నిర్వహించే బహిరంగ సభల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన ఇచ్చిన పీసీసీ జహీరాబాద్, నాగర్‌కర్నూల్, నల్గొండలలో రాహుల్ పర్యటించనున్నారని స్పష్టం చేసింది.

ఏప్రిల్ 1 మధ్యాహ్నం 12గంటలకు జహీరాబాద్ సభ, 2 గంటలకు నాగర్‌కర్నూల్ సెగ్మెంట్ వనసర్తిలో, సాయంత్రం 4గంటలకు నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ ఎన్నికల సభలలో రాహుల్ పాల్గొననున్నారు. లోక్‌సభ షెడ్యూల్ ఖరారైన తరువాత తొలిసారి రాహుల్ రాష్ట్రానికి వస్తోన్న నేపథ్యంలో సభలను భారీగా నిర్వహించేందుకు కాంగ్రెస్ శ్రేణులు సమాయత్తమయ్యారు. అయితే మరోసారి కూడా రాహుల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని.. అప్పుడు రెండు లేదా మూడు సభల్లో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కాంగ్రెస్ ముఖ్య నేత ఒకరు తెలిపారు.