పెను దిగ్గజాల ఓటమి ! ఎందుకిలా ?

|

May 23, 2019 | 6:39 PM

అవును..ఒకప్పుటి విన్నర్లే ఇప్పుడు లూజర్లయ్యారు. నిన్నటివరకు హీరోలైన వీరంతా నేడు జీరోలయ్యారు. కమలనాథులకు గట్టి పోటీనిస్తారనుకున్న వీళ్ళు ఇప్పుడు ‘ కెవ్వు ‘ మన్నారు. మాహాకూటమి పేరుతో ఒకే వేదిక మీద చేతులూపిన ఘనాపాటీలు, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడకుండా చూసేందుకు గట్టి ప్రయత్నాలు చేసినవాళ్ళు ముఖాలు మాడ్చుకుంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ ప్రధాని దేవెగౌడ, కేరళ సిఎం పినరయి విజయన్, బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, యూపీలో […]

పెను దిగ్గజాల ఓటమి ! ఎందుకిలా ?
Follow us on

అవును..ఒకప్పుటి విన్నర్లే ఇప్పుడు లూజర్లయ్యారు. నిన్నటివరకు హీరోలైన వీరంతా నేడు జీరోలయ్యారు. కమలనాథులకు గట్టి పోటీనిస్తారనుకున్న వీళ్ళు ఇప్పుడు ‘ కెవ్వు ‘ మన్నారు. మాహాకూటమి పేరుతో ఒకే వేదిక మీద చేతులూపిన ఘనాపాటీలు, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడకుండా చూసేందుకు గట్టి ప్రయత్నాలు చేసినవాళ్ళు ముఖాలు మాడ్చుకుంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ ప్రధాని దేవెగౌడ, కేరళ సిఎం పినరయి విజయన్, బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, యూపీలో మాయావతి, అఖిలేష్ ద్వయం.. తాజాగా..’ ప్రజా తీర్పు ‘ ను శిరసావహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోదీకి సవాలు నిచ్చే గట్టి ప్రతిపక్ష నేతగా పాపులరైన రాహుల్.. ఒకవేళ ఎన్డీయే ఓటమి చెందితే భావి ప్రధాని అభ్యర్థి అని ఈయనను విపక్షాలు ప్రకటించాయి. కానీ వయనాడ్ లో గెలిచినా.. అమేథీ నియోజకవర్గంలో రాహుల్ పరిస్థితి ఏమిటన్నది ఇంకా తేలలేదు. (సాయంత్రం దాదాపు 5 గంటలైనా).. ముఖ్యంగా ఈ సీట్లోనే ఆయన గెలవాల్సి ఉంది. ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ఓటమి ఊహించని విషయం. ఆయన ప్రత్యర్థి, వైసీపీ అధినేత జగన్ గెలుపు ఆయనకు మింగుడు పడడంలేదు. ఏపీ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు రెండింటి లోనూ టీడీపీ ఘోర  ఓటమి ఆయనకు చేదు నిజం. కేంద్రంలో 23 పార్టీలతో ప్రతిపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న చంద్రబాబు ఆశలు అడియాసలయ్యాయి. కేరళలో సిఎం  పినరయి విజయన్ కు చుక్కెదురయింది. కేరళ చరిత్రలోనే సీపీఎం చావుదెబ్బ తింది. ఈ పార్టీ ప్రత్యర్థి యూడీఎఫ్ సుమారు 17 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక పెద్ద రాష్ట్రమైన యూపీలో బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ బీజేపీని ఓడించేందుకు చేతులు కలిపినా వారి పాచికలు పారలేదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసికి బీజేపీ గట్టి పోటీ నివ్వడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. కర్నాటక తుంకూరు నియోజకవర్గంలో మాజీ ప్రధాని దేవెగౌడ ఓటమి చవి చూశారు. ఈ ఎన్నికల్లో గెలిచి.. అంతా బాగుంటే మళ్ళీ ప్రధాని కావచ్చునన్న ఆయన ఆశలు అడియాసలయ్యారు.  ఇలా. వీళ్ళంతా మోదీ, బీజేపీ ప్రభంజనం ముందు తలవంచక తప్పలేదు.