చంద్రబాబుపై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు

| Edited By:

Apr 07, 2019 | 9:34 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఓటమి తప్పదని టాలీవుడ్ సీనియర్ నటుడు, ప్రముఖ నిర్మాత మోహన్ బాబు వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు తిరుపతిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన కరుణాకరణ్‌రెడ్డికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. తిరుపతి ఎమ్మెల్యేగా కరుణాకర్ రెడ్డిని గెలిపించాలని నియోజకవర్గ ఓటర్లను అభ్యర్థించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయమని […]

చంద్రబాబుపై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు
Follow us on

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఓటమి తప్పదని టాలీవుడ్ సీనియర్ నటుడు, ప్రముఖ నిర్మాత మోహన్ బాబు వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు తిరుపతిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన కరుణాకరణ్‌రెడ్డికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. తిరుపతి ఎమ్మెల్యేగా కరుణాకర్ రెడ్డిని గెలిపించాలని నియోజకవర్గ ఓటర్లను అభ్యర్థించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయమని జోస్యం చెప్పారు.

“మేం విద్యాలయాల్లోనే డబ్బులు సంపాదించాం. అక్రమంగా డబ్బులు ఎక్కడా సంపాదించలేదు. దివంగత నేత వైఎస్సార్ గొప్ప రాజకీయ నాయకుడు… ప్రజాసేవ కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి వైఎస్సార్… 3,648కిలోమీటర్లు పాదయాత్ర చేసి జగన్ ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ప్రజల కోసం పోరాడుతున్న ఒకే ఒక వ్యక్తి జగన్. చంద్రబాబు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఓటుకు నోటు కేసులో పారిపోయింది చంద్రబాబే. టీడీపీ చంద్రబాబు పార్టీ కాదు” అని మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.