తనను పప్పు అనడంపై లోకేశ్ స్పందన

|

Mar 22, 2019 | 11:46 AM

మంగళగిరి: ఎన్నికల ప్రచారంలో మంత్రి నారా లోకేశ్ దూసుకెళుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఆయన ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో టీవీ9తో మాట్లాడారు. ఈ సందర్భంగా తనను పప్పు అని పిలుస్తుండటంపై స్పందించారు. వైసీపీ నాయకులకు వేరే పని లేదని, అందరికీ పేర్లు పెడతారని విమర్శించారు. వాళ్లందరినీ ఒక్కటే అడుగుతున్నాను.. ఏపీకి ఎన్నో ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చానని, ప్రజల్లో ఉన్నాను, ప్రజల మనిషిని అని అన్నారు. తాను చేస్తున్న పనికి వాళ్లు నన్ను పప్పు అంటే అది వాళ్లిష్టమని అన్నారు. […]

తనను పప్పు అనడంపై లోకేశ్ స్పందన
Follow us on

మంగళగిరి: ఎన్నికల ప్రచారంలో మంత్రి నారా లోకేశ్ దూసుకెళుతున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఆయన ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో టీవీ9తో మాట్లాడారు. ఈ సందర్భంగా తనను పప్పు అని పిలుస్తుండటంపై స్పందించారు.

వైసీపీ నాయకులకు వేరే పని లేదని, అందరికీ పేర్లు పెడతారని విమర్శించారు. వాళ్లందరినీ ఒక్కటే అడుగుతున్నాను.. ఏపీకి ఎన్నో ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చానని, ప్రజల్లో ఉన్నాను, ప్రజల మనిషిని అని అన్నారు. తాను చేస్తున్న పనికి వాళ్లు నన్ను పప్పు అంటే అది వాళ్లిష్టమని అన్నారు.

రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు కుటుంబ జీవితాన్ని మిస్ అవ్వడం తప్పదని చెప్పారు. కుమారుడు దేవాన్ష్‌కు సంబంధించిన వీడియోలను తనకు తన భార్య బ్రాహ్మణి పంపుతుంటుందని, ఆ రకంగా కొంత లోటు తీరుతుందని లోకేశ్ చెప్పారు.