మోడీ వల్లే కియా మోటార్స్ వచ్చింది : జగన్

| Edited By: Pardhasaradhi Peri

Apr 05, 2019 | 4:25 PM

సోమందేపల్లి: అనంతపురం జిల్లా సోమందేపల్లెలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ వల్లే కియా మోటార్స్ పరిశ్రమ ఇక్కడకు వచ్చిందని జగన్ అన్నారు. ఏపీకి కియా మోటార్స్‌ను తెచ్చింది తానేని చంద్రబాబు చెప్పుకుంటున్నాడని, కానీ కియా మోటార్స్‌ను ఏపీకి తెచ్చింది ప్రధాని నరేంద్ర మోదీ అని జగన్ అన్నారు. అయితే కియా మోటార్స్ రాకముందే అనంతపురంలో రైతుల నుంచి భూములు తీసేసుకున్నారని ఆరోపించారు. […]

మోడీ వల్లే కియా మోటార్స్ వచ్చింది : జగన్
Follow us on

సోమందేపల్లి: అనంతపురం జిల్లా సోమందేపల్లెలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ వల్లే కియా మోటార్స్ పరిశ్రమ ఇక్కడకు వచ్చిందని జగన్ అన్నారు.

ఏపీకి కియా మోటార్స్‌ను తెచ్చింది తానేని చంద్రబాబు చెప్పుకుంటున్నాడని, కానీ కియా మోటార్స్‌ను ఏపీకి తెచ్చింది ప్రధాని నరేంద్ర మోదీ అని జగన్ అన్నారు. అయితే కియా మోటార్స్ రాకముందే అనంతపురంలో రైతుల నుంచి భూములు తీసేసుకున్నారని ఆరోపించారు.

తన ఐదేళ్ల పాలనలో చంద్రబాబు అందరినీ మోసం చేశారని.. నిరుద్యోగులు, రైతులు, డ్వాక్రా మహిళలందరినీ మోసం చేశారంటూ జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో కనీసం 6000 స్కూళ్లు మూతపడ్డాయని ఆరోపించారు. మేనిఫెస్టోలో కులానికో పేజీ పెట్టి అందరినీ వెన్నుపోటు పొడిచారని జగన్ అన్నారు.