
తనను ఓడించేందుకు కేసీఆర్ రూ.200కోట్లు పంపారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఓటమే ధ్యేయంగా జగన్, షర్మిల, మోహన్ బాబు, లక్ష్మీ పార్వతి, ఆర్. కృష్ణయ్య సహా పలువురు నేతలు మంగళగిరిలో ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఎవరెన్ని చేసినా.. తనను ఎవరూ ఓడించలేరని ఈ సందర్భంగా లోకేశ్ పేర్కొన్నారు. జగన్ జైలు పక్షి అని.. మంగళగిరి వైసీపీ అభ్యర్థి రామకృష్ణారెడ్డి కోర్టు పక్షి అని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఇక వైసీపీ మేనిఫెస్టోలో అమరావతి పేరు కూడా లేదని ఆయన విమర్శించారు. మన రాష్ట్ర తాళాలను ఒక దొంగ చేతికి ఇస్తామా? అంటూ నారా లోకేశ్ ప్రశ్నించారు.