విజయవాడః ఏపీ సీఎం చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై టీడీపీ కీలక నేత కంభంపాటి రామ్మోహన్ రావు స్పందిస్తూ కేసీఆర్ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ అదేనంటూ వివరించారు. మళ్లీ చంద్రబాబును సీఎం చేయడమే కేసీఆర్ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ అని చెప్పారు.
కేంద్రం సహాయం చేయకపోయినా చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. మేము యూ టర్న్ తీసుకోలేదు. రైట్ టర్న్లోనే ఉన్నాము. వైసీపీ అధినేత వైఎస్ జగన్, తెలంగాణ ప్రభుత్వానికి, మోడీకి సహకరిస్తున్నారు. ఏపీలో బీజేపీకి డిపాజిట్స్ రావు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లుగానే ఏపీకి నిధులు ఇచ్చారు తప్ప ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదు అంటూ కంభంపాటి మండిపడ్డారు.
జాతీయ నేతల్లో మంచి పేరున్న వ్యక్తి చంద్రబాబు. ఐదేళ్లలో మేము చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే మాకు శ్రీరామరక్ష. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ అవినీతి కి పాల్పడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి వైసీపీ నేతలు అడ్డు తగులుతున్నారని ఆయన విమర్శించారు.