
వైఎస్సార్సీపీ నేత విజయసాయి రెడ్డి ఏం చెబితే.. ఎన్నికల సంఘం అది చేస్తోందని స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆరోపించారు. ఈసీ తమ అధికారాలను వినియోగించి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన ఎన్నికలు జరిపించిందన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన కోడెల.. గతంలో ఎన్నడూలేని విధంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని అన్నారు. ఎన్నికలకు, ఓట్ల లెక్కింపునకు 42 రోజుల గడువు ఉండటం బాధాకరం అని పేర్కొన్నారు. కేంద్రంలో, తెలంగాణలో లేని ఆంక్షలు.. ఏపీలో ఎందుకు? అని ప్రశ్నించారు.