దేశ వ్యాప్తంగా రెండో విడత లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఓటేశారు. బెంగళూరులోని జయనగర్లో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓటు వేసి ప్రతి ఒక్కరు తమ ప్రాథమిక హక్కును ఉపయోగించుకోవాలని అన్నారు.సమర్ధవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.