మోడీకి చంద్రబాబు బహిరంగ లేఖ..!

|

Mar 31, 2019 | 8:26 AM

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఆయా పార్టీల అగ్ర నేతలు ప్రచారాల్లో పాల్గొంటూ ఒకరి పై ఒకరు మాటల అస్త్రాలను సంధిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. కర్నూలు జిల్లాలో మోడీ చేసిన వ్యాఖ్యలపై ఆయన లేఖలో మండిపడ్డారు. టీడీపీ ఆవిర్భావ రోజున ఆంధ్రుల ఆత్మాభిమానాన్నీ దెబ్బతీశారని ఆయన భగ్గుమన్నారు. అంతేకాదు ఏపీ ప్రజల […]

మోడీకి చంద్రబాబు బహిరంగ లేఖ..!
Follow us on

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఆయా పార్టీల అగ్ర నేతలు ప్రచారాల్లో పాల్గొంటూ ఒకరి పై ఒకరు మాటల అస్త్రాలను సంధిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. కర్నూలు జిల్లాలో మోడీ చేసిన వ్యాఖ్యలపై ఆయన లేఖలో మండిపడ్డారు. టీడీపీ ఆవిర్భావ రోజున ఆంధ్రుల ఆత్మాభిమానాన్నీ దెబ్బతీశారని ఆయన భగ్గుమన్నారు. అంతేకాదు ఏపీ ప్రజల మనోభావాల్ని దెబ్బ తీసేలా మోడీ వ్యాఖ్యలు చేశారని.. దీనితో ప్రతీ ఆంధ్రుడు ఆగ్రహంతో రగిలిపోతున్నారని తెలిపారు. ఇక మోడీ సంధించిన 9 ప్రశ్నలకు సమాధానం ఇస్తూ చంద్రబాబు 7 పేజీల లేఖ రాశారు.