ఎస్‌ఈసీ నిమ్మగడ్డను కలిసిన టీడీపీ నేతలు.. హైకోర్టు ఆదేశాల మేరకు ఆ పంచాయతీల్లో రీ ఎలక్షన్స్‌ నిర్వహించాలని కోరిన వర్ల, బోండా

ఏపీలో పంచాయతీ ఎన్నికలు రెండోదశ కూడా పూర్తయ్యాయి. అయినా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మాత్రం అగడం..

ఎస్‌ఈసీ నిమ్మగడ్డను కలిసిన టీడీపీ నేతలు.. హైకోర్టు ఆదేశాల మేరకు ఆ పంచాయతీల్లో రీ ఎలక్షన్స్‌ నిర్వహించాలని కోరిన వర్ల, బోండా

Updated on: Feb 13, 2021 | 6:21 PM

ఏపీలో పంచాయతీ ఎన్నికలు రెండోదశ కూడా పూర్తయ్యాయి. అయినా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మాత్రం అగడం లేదు. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలతో పొలిటికల్‌గా హీట్‌ పెంచుతున్నారు. తాజాగా వైసీపీ నేతలపై ఎస్‌ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీ నేతలు వర్ల రామయ్య, బోండా ఉమా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను కలిశారు.

హైకోర్ట్‌ ఆదేశాల నేపథ్యంలో మాచర్ల, తంబళ్లపల్లి, పుంగనూరు నియోజకవర్గాలలో వచ్చిన ఫిర్యాదుల మేరకు ఎన్నికలు రద్దుచేసి తిరిగి నిర్వహించాలని ఎస్‌ఈసీని కోరినట్టు చెప్పారు. సీఎం ఇచ్చిన టార్గెట్‌ మేరకు 90 శాతం పంచాయతీలు గెలవకపోతే తమ పదవులు పోతాయనే భయంతో వైసీపీ నేతలు నిప్పు తొక్కిన కోతుల్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు.

వైసీపీ నేతలు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆరోపించారు బోండా ఉమా. అధికార మదంతో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఎలక్షన్‌ హాల్‌లో ఉండాల్సిన బ్యాలెట్‌ పేపర్లు బయటకు తీసుకురావడంతో పాటు తగుల పెట్టడాన్ని బట్టి ప్రజాస్వామ్యం ఖూనీ అయిందనిపిస్తోందన్నారు.

 

Read more:

సాగర్‌ ఉపఎన్నికకు పార్టీల సైరన్‌ .. టీఆర్‌ఎస్‌ సభకు పోటీగా పాదయాత్రకు సిద్ధమవుతున్న కోమటిరెడ్డి

Loading...
Unable to load recommendations.
Follow Us