లాక్ డౌన్ వేళ.. పోలీస్ స్టేషన్లో పెళ్లి..
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. కరోనా వచ్చినా, మరేదైనా ప్రళయమే వచ్చినా తమ పెళ్లి జరగాల్సిందేనని ఓ జంట కరోనా సాక్షిగా శపథం చేసుకున్నట్లుంది. ఇంట్లో పెళ్లి చేసుకుందామంటే ఇరుకిరుకు, పోనీ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుందామంటే 20 మందికంటే ఎక్కువ ఉండద్దూ, సామాజిక దూరం పాటించాలి, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించకూడదంటూ వంద షరతులు. దీంతో ఇవన్నీ కాదు కానీ అంటూ అన్నింటికన్నా సేఫెస్ట్ ప్లేస్ పోలీస్ స్టేషన్ ను ఎంచుకున్నారు. యూపీలోని మహుజీకి చెందిన అనిల్, ఘాజీపూర్కు […]
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. కరోనా వచ్చినా, మరేదైనా ప్రళయమే వచ్చినా తమ పెళ్లి జరగాల్సిందేనని ఓ జంట కరోనా సాక్షిగా శపథం చేసుకున్నట్లుంది. ఇంట్లో పెళ్లి చేసుకుందామంటే ఇరుకిరుకు, పోనీ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుందామంటే 20 మందికంటే ఎక్కువ ఉండద్దూ, సామాజిక దూరం పాటించాలి, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించకూడదంటూ వంద షరతులు. దీంతో ఇవన్నీ కాదు కానీ అంటూ అన్నింటికన్నా సేఫెస్ట్ ప్లేస్ పోలీస్ స్టేషన్ ను ఎంచుకున్నారు.
యూపీలోని మహుజీకి చెందిన అనిల్, ఘాజీపూర్కు చెందిన జ్యోతి సోమవారం నాడు పోలీసుల సమక్షంలో చందౌలిలోని ధీనా పోలీస్ స్టేషన్లో వివాహం చేసుకున్నారు. ఈ విషయం గురించి పోలీసులు మాట్లాడుతూ.. గతంలో అనిల్ బోటు ప్రమాదంలో కొంతమంది ప్రయాణికులను రక్షించాడని, అప్పుడు తామందరమూ అతని ధైర్యసాహసాలను కొనియాడామన్నారు. తాజాగా అతని పెళ్లి సమస్యను తమకు తెలపడంతో స్టేషన్లోనే జరిపేందుకు సిద్ధమయ్యామన్నారు.
Also Read: కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం.. ఇక వారిపై దాడి చేస్తే జైలు, భారీ జరిమానా