
మన భారతీయల్లో చాలా మంది భోజనం చేసేప్పుడు పక్కకు నంచుకోవడానికి వడియాలు, అప్పడాలను ఎక్కవుగా ఉపయోగిస్తారు. పప్పు అన్నం, లేదా సాంబార్తో తినేప్పుడు ఈ అప్పడాల కాంబినేషన్ వేరె లెవల్గా రుచిని అందిస్తుంది. అయిఏ ఈ అప్పడాలు వెయించేందుకు మనం సాధారణంగా అయిల్ను ఉపయోగిస్తాం.

కానీ ప్రస్తుత రోజుల్లో అనారోగ్యం కారణంగా చాలా మంది నూనెకు దూరంగా ఉండాలని చూస్తున్నారు. అలాంటి వారి కోసమే మాస్టర్ చెఫ్ పంకజ్ బధోరియా అదిరిపోచే చిట్కాను తీసుకొచ్చారు. చుక్క నూనె కూడా లేకుండా మన వంటిట్లో లభించే ఉప్పుతో అప్పడాలను వేయించుకోవచ్చని ఆయన చెబుతున్నారు.

ఇందుకోసం ముందుగా మనం ఒక మందమైన బాండి తీసుకొని దాన్ని స్టౌపై ఉంచి దానిలో కాస్త ఉప్పు పోయాలి. తర్వాత దాన్ని వేడి చేయాలి. ఉప్పు నుంచి వేడి అవిరి వచ్చిందంటే అది వెయించడానికి సిద్దమైనట్టు అర్థం. ఇక మీ ఇంట్లో ఒడియాలు, లేదా అప్పడాలు తెచ్చి ఉప్పులో వేసి గరిటతో కలపండి. ఆ ఉప్పు వేడికి అప్పడాలు ఉబ్బుతూ క్రిస్పీగా తయారవుతాయి.

అప్పడాలు పూర్తిగా కాలేందుకు వాటిని పూర్తిగా ఉప్పులో మునిగేలా గరిటిలో కలుపుతూ ఉండడండి. అలాగే వాటిని తొగించేప్పుడు జాలి గంటెతో తీసుకేందుకు ప్రయత్నించండి. ఇలా చేయడం ద్వారా అప్పడాలకు ఉప్పు అంటుకోకుండా ఉంటుంది. అంతేకాదు మీకు బయట మార్కెట్లో దొరికే రంగురంగుల అప్పడాలను కూడా ఈ ఉప్పులో వెయించుకోవచ్చు.

ఇవే కాదు నూనె లేకుండా అప్పడాలు వేయించుకునేందుకు మైక్రోవేవ్ ఓవెన్ కూడా బెస్ట్ ఆప్షన్. అప్పడాలు దేదా వడియాలను ఇందులో వేసి 'ఫ్రై' ఆప్షన్ పెట్టి సెట్ చేస్తే క్షణాల్లోనే మీకు అప్పడాలు రెడీ అవుతాయి. ఎయిర్ ప్రైయర్తో కూడా అయిల్ లేకుండా స్నాక్స్ చేసుకోవచ్చు. మీతో ఇవేవి లేవు అనుకుంటే ఉప్పు మీకు బెస్ట్ ఆప్షన్ అవుతంది.

ఇలా అయిల్ ఫ్రీ అప్పడాలు నూనె పదార్థాలు తినొద్దు అనుకునే వారికి ఆరోగ్యంపై శ్రద్ధ వహించే వారికి, బరువు తగ్గాలనుకునే వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అలాగే ఇవి ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి.( Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న నివేదికలు ఆధారంగా అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. టీవీ9 దీనికి ఏ విధంగానూ బాధ్యత వహించదు)