
మయన్మార్ నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయి వచ్చిన పది లక్షల మంది ఇక్కడ తలదాచుకుంటున్నారు

బంగ్లాదేశ్లోని రోహింగ్యా శరణార్ధుల శిబిరంలో జరిగిన అగ్ని ప్రమాదం మృతులు 15కు చేరారు

ఈ ఘటనలో 400 మంది ఆచూకీ తెలియటం లేదని, అగ్ని ప్రమాదం కారణంగా 45వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి వర్గాలు వెల్లడించాయి

ఐక్యరాజ్య సమితి రోహింగ్యా రెఫ్యూజీల కోసం టెంట్లు నిర్మించడంతో పాటు వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తోంది

ఈ క్యాంప్లో అగ్ని ప్రమాదం జరగడంతో గంటల వ్యవధిలోనే వందల గుడారాలు తగలబడిపోయాయి

ఉవ్వెత్తున లేచిన ప్రమాదానికి భయపడిన శరణార్దులు ప్రాణాలు కాపాడుకునేందుకు పిల్లల్ని, అయిన వాళ్లను వదిలి ఎటు పడితే అటు పరుగులు తీశారు. దీంతో చాలా మంది తమ వారెక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి