
దేశంలో ప్రస్తుతం ఏం జరుగుతున్నాయో కూడా ఎవరికి అర్ధం కాకుండా ఉంది. గంట గంటకి లెక్కలు మొత్తం మారుతున్నాయి. ఇక ప్రజలు వీటిని చూసి టెన్షన్, ఆందోళన చెందుతున్నారు. మొన్న బంగారం, నేడు గ్యాస్.. రేపు ఏంటో అంటూ ఉలిక్కిపడుతున్నారు.

అప్పుడేమో బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి. ఒక్క రోజైన తగ్గుతాయమో అనుకున్నారు కానీ ధరలు మాత్రం రోజు రోజుకి అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. ఒక రోజు తగ్గినా .. ఇంకో రోజు మాత్రం విపరీతంగా పెరిగి సామాన్యులకు కునుకు లేకుండా చేస్తుంది.

ఇక గత రెండు రోజుల నుంచి గ్యాస్ ధరలు పెరిగి సామాన్యుడికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే ఓ వైపు బంగారం, ఇంకో వైపు గ్యాస్ ధరలు మండిపోవడంతో ఏం చేయాలో తెలియక అల్లాడిపోతున్నారు.

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరిగే యుద్ధం వలన త్వరలో ప్రజలకు ఇంకో బిగ్ షాక్ తగలనుంది. మెడిసిన్స్ రేట్స్ కూడా అమాంతం పెరుగుతాయని నిపుణులు అంచనా వేసి చెబుతున్నారు. కాబట్టి, ప్రజలు ఆచి తూచి ఖర్చులు పెట్టాలని అంటున్నారు.

ఇంకా చెప్పాలంటే మనం రోజూ వాడుకునే నిత్యావసర వస్తువులు, కూరగాయల రేట్స్ కూడా భారీగా పెరగనున్నాయని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. దీని వలన సామాన్యుడి బతుకు దారుణంగా మారనుంది. వారిపైనే తీవ్ర ప్రభావం చూపనుంది.