
2025 నుంచి ప్రకృతి విలయతాండవం ఆడటం చూస్తున్నాము. ఇక 2026 మొదటి నుంచే భూకంపాలు, వరదలు, ప్రమాదాలు లాంటివి చూస్తున్నాము. ఇక సమయంలో బాబా వంగా చెప్పిన జోస్యం గుర్తువస్తుంది.

ఇప్పుడు ఒక వైపు ఇరాన్ , ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం గురించి బాబా వంగా ముందుగానే అంచనాలు వేసి చెప్పారు. అలాగే, కరోనా గురించి కూడా ఆమె ఎలా చెప్పిందో అలాగే జరిగింది.

ఉగాది తర్వాత ఊహించని విధంగా ఉండబోతుందని బాబా వంగా ముందే అంచనా వేసి చెప్పారు. ప్రకృతి ఎవరి మాట వినకుండా ప్రవర్తించడానికి సిద్ధమవుతుందని అంచనా వేశారు. భయంకరమైన భూకంపాలు, భారీ వరదలు, అతి భారీ వర్షాలు పడనున్నాయని చెప్పారు.


సముద్రాల అడుగున ఉన్న జీవులు పైకి వచ్చినప్పుడు భూమి మీద పెద్ద గందరగోళమే జరుగుతుందని అంచనా వేశారు. ఇలా ఒకటి కాదు ఎన్నో విపత్తులు భూమిపైన భారీ నష్టాన్నికలిగించనున్నాయని బాబా వంగా ముందే అంచనా వేశారు.