
మన దేశ వ్యాప్తంగా అధిక మంది ప్రయాణించేది రైలు మార్గంలోనే. రైలు ప్రయాణం అత్యంత సురక్షితంగా, సౌకర్యవంతమైనదిగా ఉండటమే అందుకు కారణం. నేటికీ మన దేశంలో లక్షలాది మంది రైలులో ప్రయాణించడానికి ఇష్టపడుతున్నారు. పైగా రైలులో ప్రయాణించడానికి టిక్కెట్ల ధరలు తక్కువగా ఉంటాయి. అందుకే చాలా మంది రైలులో ప్రయాణించడానికి ఇష్టపడతారు.

ప్రతిరోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తారు కాబట్టిప్రయాణీకుల భద్రత కోసం భారత రైల్వేలు కొన్ని నియమాలను రూపొందించాయి. ఈ నియమాలను ఖచ్చితంగా పాటిస్తారు. ఏదైనా నియమాన్ని ఉల్లంఘిస్తే అది పెద్ద విపత్తుకు దారితీస్తుంది. అందుకే రైల్వేలకు దాని స్వంత నియమాలు ఉన్నాయి.

రైళ్ల భద్రతను నిర్ధారించడానికి రైల్వేలు అనేక సిగ్నల్లను ఉపయోగిస్తాయి. రైలు ప్రయాణంలో వివిధ సందేశాలను అందించడానికి ఈ సిగ్నల్లను ఉపయోగిస్తారు. అలాంటి ఒక ప్రత్యేక సందేశం రైలు చివరి కోచ్పై ఉంటుంది.

రైలు చివరి కోచ్ పై X అనే అక్షరం ఉంటుంది. మీరు ఈ గుర్తును రైలు చివరి కోచ్ పై చాలా సార్లు చూసి ఉంటారు. ఈ అక్షరం X కు రైల్వే శాఖలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ X అక్షరం సందేశం ప్రయాణీకుల కోసం కాదు.. కేవలం రైల్వే శాఖ, రైల్వే ఉద్యోగుల కోసం మాత్రమేనట.

రైలు చివరి కోచ్ వెనుక ఉండే X అనే అక్షరం కనిపిస్తే.. సదరు రైలు అన్ని కోచ్లను తనతో తీసుకెళ్లిందని అర్థం. ఒక్క కోచ్ కూడా మర్చిపోలేదని, ఎక్కడా వదిలేయలేదని అర్థమట. అంటే రైలు దాని అన్ని కోచ్లతో సురక్షితంగా వెళ్తుందని అర్థం.