
ఉదయం లేదా భోజనం తర్వాత బొప్పాయి తినడం మంచిది. అల్పాహారంలో స్మూతీ, సలాడ్ లేదా జ్యూస్గా బొప్పాయిని తీసుకోవడం వల్ల మొత్తం ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. భోజనం తర్వాత కొద్దిసేపటికే బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది. బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్ను జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఈ పండు మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. ప్రేగులను శుభ్రపరుస్తుంది.

భోజనం తర్వాత బొప్పాయి తినడం వల్ల అందులో ఉండే పపైన్ ఎంజైమ్ ఆహారం వేగంగా జీర్ణమవుతుంది. భోజనం తర్వాత బొప్పాయి తినడం వల్ల ఆమ్లత్వం నియంత్రణలో ఉంటుంది. ఈ పండు కడుపు వేడిని తగ్గిస్తుంది. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ఈ పండులోని ఫైబర్ పేగులను చురుగ్గా ఉంచుతుంది.

ప్రస్తుత రోజుల్లో చాలా మంది లేటెక్స్ అలెర్జీ సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు బొప్పాయికి దూరంగా ఉండాలి. ఒకవేళ తింటే అలర్జీ వచ్చే అవకాశం ఉంది. దాంతో దద్దుర్లు, తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది , శరీరంలో వాపు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

బొప్పాయి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తుంది. అయితే ఏదైనా గుండె జబ్బుతో బాధపడేవారు మాత్రం బొప్పాయి తినకపోవడం మంచిది. ఎందుకంటే బొప్పాయిలో హృదయ స్పందనలు సక్రమంగా ఉండకుండా చేసే కొన్ని పదార్థాలు ఉంటాయి.

Papaya