ఇప్పటికే తిరుపతి-సికింద్రాబాద్ మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ ట్రయిల్ రన్ పూర్తయింది. అంతేకాకుండా.. ఈ రెండు నగరాలను కనెక్ట్ చేసేందుకు నాలుగు మార్గాలు అందుబాటులో ఉండగా.. మొదటిగా నారాయణాద్రి ఎక్స్ప్రెస్ వెళ్లే రూట్లోనే వందేభారత్ను నడపనున్నారట.
అంటే సికింద్రాబాద్ నుంచి బీబీనగర్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా ఈ వందేభారత్ రైలు తిరుపతి చేరుకోనుంది.
ఇక వందేభారత్ రైలు ప్రారంభమైతే.. సికింద్రాబాద్ నుంచి తిరుపతి.. 12 గంటలు కాస్తా.. ఇకపై ఆరున్నర గంటల నుంచి 7 గంటల ప్రయాణం అవుతుంది.
కాగా, వందేభారత్ రైలులో ఎగ్జిక్యూటివ్ చైర్ కారు ధర రూ. 2వేలు పైమాట.. ఏసీ చైర్ కారు రూ. 1150గా ఉండొచ్చునని సమాచారం.