
వర్షం పడేటప్పుడు ప్రతి ఇంట్లో ఈ కూర ఉడకాల్సిందే మాములుగా కంటే వీటిని చాలా మంది వానలు పడేటప్పుడు ఎంతో మంది తింటారు. ఎందుకంటే, ఇవి ఆ సమయంలోనే ఎక్కువగా దొరుకుతాయి ఇంతకీ అదేంటో ఇక్కడ వివరంగా చదివి ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం..

వాలుగ చేపల కూరకు కావాల్సిన పదార్ధాలు: అరకిలో చేపలు, నిమ్మకాయంత సైజం చింతపండు రసం, మూడు ఉల్లిపాయలు, కట్ చేసిన 10 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి, ఒక టేబుల్ స్పూన్ గస గసాలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, ధనియాలు పొడి, కొత్తిమీర, నూనెను తీసుకోవాలి.

వాలుగ చేపల కూర తయారీ విధానం స్టెప్ 1: ముందుగా చేప ముక్కలను పసుపు నీటిలో మూడు సార్లు కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చింతపండు నుంచి రసం వేరు చేసి ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకోవాలి. ఇంకా స్టవ్ వెలిగించి దాని మీద ఆయిల్ వేసి అది వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిలు వేసి ఎర్రగా మగ్గించాలి.

వాలుగ చేపల కూర తయారీ విధానం స్టెప్ 2: కూర మధ్యలో అర టీ స్పూన్ పసుపు, కారం, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, ముందుగా కడిగి పెట్టుకున్న చేపల ముక్కలను, ఇంకా చింతపండు రసాన్ని కూడా వేసి వీటితో పాటు రుచికి సరిపడా ఉప్పు వేసి, పోసి మూత పెట్టి ఉడికించాలి.

చివర్లో వీటిని కనీసం 15 నుంచి 30 నిముషాల పాటు బాగా ఉడికిస్తే మంచి రుచి వస్తుంది అలా అని దీనిని హై మంట పై ఉడికించకూడదు. మీడియం మంట మీద ఈ ముక్కలు ఉడికిస్తే యమా రుచి వస్తుంది ఇంకా వీటిని ఇవి పైకి తేలే వరకు అలాగే ఉంచాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి అన్నంలో తినడమే