
పటిక: రాత్రి పడుకునే ముందు పటిక నూనెను ముఖానికి పట్టించి, ఉదయాన్నే ముఖం కడుక్కోవాలి. ఇది మీకు మెరిసే చర్మాన్ని అందిస్తుంది. కొబ్బరినూనెలో ఈ పదార్థాన్ని మిక్స్ చేసి మెడ, చంకల్లో నల్లగా ఉన్న చోట రాస్తే ఒక్కసారిగా ఆ డార్క్ నెస్ క్లియర్ అవుతుంది. పటికను నీటిలో ముంచి, తేలికగా చేతులతో ముఖం మీద రుద్దండి. కొంత సమయం అది ఆరిన తర్వాత శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోండి. ఈ రెమెడీ మీ ముఖంపై ఫైన్ లైన్స్ మరియు ముడతలు రాకుండా చేస్తుంది.

పుదీనా రసం: పుదీనా రసంతో ముఖానికి మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంలోని మొటిమలను సహజంగా పోగొట్టుకోవచ్చు.

దేశీ నెయ్యి: రాత్రి పడుకునే ముందు మీ ముఖానికి దేశీ నెయ్యిని అప్లై చేసుకోవాలి.. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల ముఖకాంతి పెరుగుతుంది.

ఆయిల్ మసాజ్: బాదం నూనె, కొబ్బరి నూనెతో మీ ముఖాన్ని మసాజ్ చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖంలో మెరుపు పెరుగుతుంది.

Cucumber ,diabetes: ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో మూడు నుంచి నాలుగు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల మెరిసే చర్మాన్ని పొందవచ్చు. అలాగే, కీరా దోసకాయ తీసుకోవడం వల్ల కూడా చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖం మెరుస్తుంది.